Home » Bhatti Vikramarka
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ నేపథ్యంలో సామాన్యులకు సిమెంటు, స్టీల్, ఇటుకలు, ఇసుక ధరలు అందుబాటులో ఉండేందుకు మండల స్థాయిలో ధరల నిర్ణయ కమిటీలను ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా పలువురు నేతలు ఆయనకు నివాళులర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో పీవీ చిత్రపటానికి పూలమాల వేసి స్మరించుకున్నారు.
PV Narasimha Rao Jayanti: మాజీ ప్రధాని పీవీకి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. పీవీ జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు సీఎం.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర సర్కార్ తీపి కబురు అందించింది. రెండేళ్ల నుంచి పెండింగ్లో ఉన్న ఉద్యోగుల మెడికల్ రీ-యింబర్స్మెంట్ బిల్లులను క్లియర్ చేసింది.
చార్టెర్డ్ అకౌంటెంట్లు(సీఏలు) ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికలో భాగస్వాములు కావాలని, చిన్న వ్యాపారాల ఆర్థికాభివృద్ధికి దోహదపడాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు.
Bhu Bharati land survey: దొంగ పాస్ బుక్లకు కూడా రైతు భరోసా ఇవ్వాల్సిన పరిస్దితి ఏర్పడిందని, చెరువులు రహదారులు డొంకలు అన్నీ అక్రమణకు గురయ్యాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎన్నికల సమయంలో ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చేప్పామని, ప్రజలకు ఇచ్చిన మాట మేరకు భూ భారతి తెచ్చామని మంత్రి చెప్పారు.
Deputy CM Bhatti Vikramarka: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నామని, ప్రతి నియోజకవర్గానికి ఒకేసారి 3,500 కేటాయించి నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
తెలంగాణ యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి, ఖజానాకు ఆదాయం సమకూర్చే పరిశ్రమలు రాష్ట్రం దాటకుండా అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని రష్యా కాన్సుల్ జనరల్ వాలెరి ఖోడ్జాయేవ్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు.
యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఉత్పన్నమయ్యే అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పోలీసు అధికారులు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని ముందుకు వెళ్లాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు.