Home » Betting apps
కొన్ని బెట్టింగ్ యాప్లు డిపాజిట్పై బోనస్లు, లాస్ అమౌంట్పై బోనస్లతో ఆకర్షిస్తున్నాయి. బోనస్ పేరు చూడగానే చాలామంది ఓ సారి ట్రై చేద్దామనే ఉద్దేశంతో బెట్టింగ్ ఊబిలోకి దిగుతున్నారు. తాజాగా ఐపీఎల్ సీజన్ రావడంతో 50 శాతం రిఫండ్ పేరుతో కొన్ని యాప్లు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. వాటిని నమ్మితే నిలువుగా మోసపోవడం తప్పా.. పావలా లాభం లేదనే విషయాన్ని గుర్తించాలి.
Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్కు ప్రమోషన్ చేసిన వారిని ఎవ్వరినీ కూడా విడిచిపెట్టని పరిస్థితి. తాజాగా యూట్యూబర్కు పోలీసులు లుక్ఔట్ నోలీసులు జారీ చేశారు.
ఐపీఎల్ వచ్చిందంటే బెట్టింగ్ మాఫియా రెచ్చిపోతుంది. సామాన్య ప్రజలను బెట్టింగ్ ఊబిలోకి నెట్టి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి ఈ బెట్టింగ్ మాఫియా కారణమవుతోంది. ఆన్లైన్ బెట్టింగ్కు బానిసై ఆర్థికంగా నష్టపోయి జనవరి, ఫిబ్రవరి నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50 మందికి పైగా ..
యువతను నాశనం చేసే బెట్టింగ్ యాప్లు, సమాజాన్ని చెడగొట్టే వాణిజ్య ప్రకటనలను సినీనటులు ప్రోత్సహించవద్దని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సూచించారు.
బెట్టింగ్ యాప్ల ప్రచారం వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మియాపూర్ పోలీస్ స్టేషన్లో 25 మంది ప్రముఖ సినీ, టీవీ నటులు, యూట్యూబర్లపై కేసులు నమోదైన నేపథ్యంలో వారికి మరో 24 గంటల్లో నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారికి, ప్రస్తుతం చేస్తున్న వారికి తెలంగాణ పోలీసు శాఖ చుక్కలు చూపిస్తోంది.పెద్ద పెద్ద సినిమా స్టార్లను కూడా వదలటం లేదు.తొక్కినార తీస్తోంది.
హైదరాబాద్లోని వినాయకనగర్కు చెందిన ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న యువకడు తరుణ్ రెడ్డి బెట్టింగ్ యాప్లకు ఆకర్షితుడై అప్పులపాలై ఈఏడాది జనవరిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరవకొండకు చెందిన ఓ ప్రయివేట్ ఉద్యోగి కిశోర్ కుమార్ బెట్టింగ్ యాప్ కారణంగా ఫిబ్రవరిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డబ్బు ఆశ చూపించి బెట్టంగ్ ఊబిలోకి దించి బయటకు రాలేని పరిస్థితులు కల్పిస్తుండటంతో బెట్టింగ్ యాప్స్ కారణంగా ముఖ్యంగా యువత తమ ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు.
ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, క్యాసినో యాప్ల ప్రచారానికి సంబంధించి.. సినీ నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, నిధి, అగర్వాల్, ప్రణీత, అనన్య నాగళ్ల సహా 25 మంది సినీ, టీవీ ప్రముఖులపై మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
బెట్టింగ్ యాప్ల పేరుతో గంటలకు వందల కోట్ల వ్యాపారం., రోజుకు పదుల సంఖ్యలో ఆత్మహత్యలు.. లక్షల్లో నష్టపోతున్న సామాన్య ప్రజలు.. ప్రతి గ్రామంలో విస్తరించిన బెట్టింగ్ మార్కెట్.. సంపాదనలో 50 శాతానికి పైగా బెట్టింగ్పైనే.. ఇలాంటి పరిస్థితుల్లో బెట్టింగ్ యాప్ నిర్వహకులపై చర్యలు ఉండవా..
తెలంగాణ పోలీసుల దెబ్బకు, జబర్దస్త్ ఫేమ్, టీవీ నటి రీతూచౌదరి దారికి వచ్చింది. బెట్టింగ్ యాప్స్ వద్దంటూ వీడియో విడుదల చేసింది. తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశానని రీతూ చౌదరి ఒప్పుకుంది.