Home » Basara Gnana Saraswati
Basara Saraswathi Devi Temple: బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో రాత్రి సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. క్యూలైన్ మీదుగా నడుచుకుంటూ వచ్చిన దొంగ గోషాల పై నుంచి ఆలయంలోకి దిగాడు. దత్త మందిరం ముందున్న హుండీని పగలగొట్టి నగదును తీసుకున్నాడు.
బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన దేవాలయం. తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు వివిధ ప్రాంతాల నుంచి బాసరకు తరలి వస్తుంటారు. ప్రతి ఏటా వసంత పంచమి రోజున అమ్మవారి ఆలయంలో వేలాదిగా అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తారు.
నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రసాదాల విక్రయాల్లో అక్రమాలు మరోసారి బట్టబయలయ్యాయి. బాసర గ్రామస్థుల చొరవతో ఆలయ సిబ్బంది అవినీతి బాగోతం బట్టబయలైంది. గ్రామస్థుల ముందస్తు సమాచారం మేరకు అధికారులు ప్రసాదాల విక్రయ కేంద్రం వద్ద శుక్రవారం తనిఖీలు చేపట్టారు.
గుడిని గుడిలో లింగాన్ని మింగేస్తారంటే ఏమో అనుకున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో అది మన కళ్లెదుట స్పష్టంగా తేటతెల్లమవుతూ ఉంటుంది. బాసర జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో కాదేదీ అవినీతి, అక్రమాలకు అనర్హం అన్నట్టుగా.. ప్రసాదాల విక్రయంలో సిబ్బంది చేతి వాటం ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. విషయాన్ని గమనించిన భక్తులు ఆలయ ఈవోకు రెడ్ హ్యాండెడ్గా పట్టించారు.
కాశీ పుణ్యక్షేత్రంలో నిరంతరాయంగా జరుగుతున్న గంగా హారతి మాదిరిగా గోదావరి పరివాహక ప్రాంతంలో వెలసిన బాసర(Basara) పుణ్యక్షేత్రంలో నిత్య గంగా (గోదావరి) హారతి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నట్లు నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ వేద భారతీ పీఠం పండితుడు, అధ్యాపకుడు గురుచరణ్ తెలిపారు.
Telangana: పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కమలం పార్టీ శ్రీకారం చుట్టింది. నేటి నుంచి మార్చి 2 వరకు విజయసంకల్ప యాత్ర పేరుతో రథయాత్రలు చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా మంగళవారం ఉదయం బాసర సరస్వతీ దేవి ఆలయం నుంచి బీజేపీ విజయసంకల్ప యాత్ర ప్రారంభమైంది.
Telangana: బాసర సరస్వతీ అమ్మవారిని ఎంపీ సోయం బాపు రావు, బీజేపీ నేతలు మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. దర్శనానంతరం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ఎంపీ సోయంబాపురావు మాట్లాడుతూ.. విజయ సంకల్ప యాత్రలతో పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరిస్తున్నామన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 10 స్థానాల్లో పాగా వే యాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ మరో రెండు నెలల్లో వెలువడనుంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నా యి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు బీజేపీ అధిష్ఠానం ప్రణాళికలు రూపొందించింది.
నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయం వివాదాలకు కేరాఫ్గా మారుతోంది..! రెండ్రోజులకో వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటున్న పరిస్థితి..