Home » Basara Gnana Saraswati
బాసర ట్రిపుల్ ఐటీ సీఐ (చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్) రాకేశ్ను మంగళవారం సాయంత్రం విధుల నుంచి తొలగించారు.
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడకపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమవుతోందన్న విమర్శలున్నాయి. రెండేళ్లలో 9 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.
నిర్మల్ జిల్లా బాసరలోని ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీలో ఫీజుల బకాయిల వసూలుకు అధికారులు అమలు చేస్తున్న నిబంధన.. పేద విద్యార్థులకు శాపంగా మారుతోంది.
దక్షిణ భారతదేశంలోని ఏకైక చదువుల తల్లి కొలువైన బాసర క్షేత్రంలో మూల నక్షత్రం పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చరేయిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం అర్ధరాత్రి మూల నక్షత్రం వస్తుందని, రెండు గంటల నుంచి ఆలయంలో అక్షరాభ్యాస పూజలను ప్రారంభించారు.
Basara Saraswathi Devi Temple: బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో రాత్రి సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. క్యూలైన్ మీదుగా నడుచుకుంటూ వచ్చిన దొంగ గోషాల పై నుంచి ఆలయంలోకి దిగాడు. దత్త మందిరం ముందున్న హుండీని పగలగొట్టి నగదును తీసుకున్నాడు.
బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన దేవాలయం. తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు వివిధ ప్రాంతాల నుంచి బాసరకు తరలి వస్తుంటారు. ప్రతి ఏటా వసంత పంచమి రోజున అమ్మవారి ఆలయంలో వేలాదిగా అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తారు.
నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రసాదాల విక్రయాల్లో అక్రమాలు మరోసారి బట్టబయలయ్యాయి. బాసర గ్రామస్థుల చొరవతో ఆలయ సిబ్బంది అవినీతి బాగోతం బట్టబయలైంది. గ్రామస్థుల ముందస్తు సమాచారం మేరకు అధికారులు ప్రసాదాల విక్రయ కేంద్రం వద్ద శుక్రవారం తనిఖీలు చేపట్టారు.
గుడిని గుడిలో లింగాన్ని మింగేస్తారంటే ఏమో అనుకున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో అది మన కళ్లెదుట స్పష్టంగా తేటతెల్లమవుతూ ఉంటుంది. బాసర జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో కాదేదీ అవినీతి, అక్రమాలకు అనర్హం అన్నట్టుగా.. ప్రసాదాల విక్రయంలో సిబ్బంది చేతి వాటం ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. విషయాన్ని గమనించిన భక్తులు ఆలయ ఈవోకు రెడ్ హ్యాండెడ్గా పట్టించారు.
కాశీ పుణ్యక్షేత్రంలో నిరంతరాయంగా జరుగుతున్న గంగా హారతి మాదిరిగా గోదావరి పరివాహక ప్రాంతంలో వెలసిన బాసర(Basara) పుణ్యక్షేత్రంలో నిత్య గంగా (గోదావరి) హారతి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నట్లు నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ వేద భారతీ పీఠం పండితుడు, అధ్యాపకుడు గురుచరణ్ తెలిపారు.
Telangana: పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కమలం పార్టీ శ్రీకారం చుట్టింది. నేటి నుంచి మార్చి 2 వరకు విజయసంకల్ప యాత్ర పేరుతో రథయాత్రలు చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా మంగళవారం ఉదయం బాసర సరస్వతీ దేవి ఆలయం నుంచి బీజేపీ విజయసంకల్ప యాత్ర ప్రారంభమైంది.