Home » Bangladesh
బంగ్లాదేశ్లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఇస్కాన్ సంస్థను నిషేధించాలని చిట్టగాంగ్కు చెందిన ఉగ్రవాద సంస్థ హెఫాజత్ ఎ ఇస్లాం పిలుపునివ్వడంతో వివాదం నెలకొంది.
ఈ నెల 7వ తేదీలోపు విద్యుత్ బకాయిలు చెల్లించకపోతే కరెంటు సరఫరాను నిలిపివేస్తామని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఝార్ఖండ్లోని అదానీ పవర్ కంపెనీ హెచ్చరించింది.
ముస్లింలు మెజారిటీగా ఉన్న బంగ్లాదేశ్లో తమకు రక్షణ లేకుండా పోయిందని హిందువులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మధ్యంతర ప్రభుత్వం తమను దాడులు, వేధింపుల నుంచి రక్షించాలని, హిందూ సమాజ నాయకులపై దేశద్రోహ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ 30 వేల మంది మైనారిటీ హిందువులు ర్యాలీ నిర్వహించారు.
ప్రముఖ హిందూ సాధువు, ఇస్కాన్ గురువు చిన్మయ కృష్ణపై బంగ్లాదేశ్లోని మధ్యంతర ప్రభుత్వం దేశద్రోహం కేసు నమోదు చేసింది.
షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన అకృత్యాలను డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. మత అజెండాల నుంచి హిందూ అమెరికన్లను కాపాడతానని, వారి స్వేచ్ఛ కోసం పోరాడుతానని ట్రంప్ హామీ ఇచ్చారు. దీపావళి సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత కెప్టెన్ తప్పుకోవడం, జట్టులో సీనియర్ ఆల్ రౌండర్ కూడా ఆటకు వీడ్కోలు పలకడంతో బంగ్లా జట్టు సందిగ్దంలో పడింది. జట్టుకు కొత్త కెప్టెన్ కోసం తీవ్రంగా గాలిస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపుతున్న నిధులను టీఎంసీ ప్రభుత్వం దోచుకుంటోందని కేంద్ర హోం మంత్రి అమిత్షా రోపించారు. గత పదేళ్ల ఎన్డీయే హయాంలో బెంగాల్కు రూ.56,000 కోట్లు ఇచ్చిందన్నారు.
రాజకీయ సంక్షోభంతో అధికారం చేతులు మారిన బంగ్లాదేశ్లో.. హిందువులు గళమెత్తారు. షేక్ హసీనా ప్రభుత్వం అనంతరం తొలిసారి భారీ ర్యాలీ నిర్వహించారు.
హిందూ కమ్యూనిటీ డిమాండ్లను తాము తెలుసుకున్నామని, వారికి హామీగా దుర్గాపూజకు రెండు సెలవు దినాలను ప్రకటించామని బంగ్లాదేశ్ పర్యావరణ మంత్రి సైయద్ రిజ్వాన హసన్ తెలిపారు. బంగ్లాదేశ్ చరిత్రలోనే రెండ్రోజుల సెలవు ప్రకటించడం ఇదే మొదటిసారని అన్నారు.
బంగ్లాదేశ్లో మళ్లీ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా లేఖ గురించి బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహబుద్దీన్ చేసిన వ్యాఖ్యలు అక్కడ తీవ్ర దుమారాన్ని రేపా యి.