Home » Bandi Sanjay
భార్య పుస్తెలు అమ్మి పోటీ చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్కు కోట్ల రూపాయలు ఎక్కడివని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. బండి సంజయ్కు రేవంత్ రెడ్డి డబ్బులు పంపిస్తున్నారని ఆరోపించారు.
అన్నదాతల బాధలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ నిలదీశారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కొనుగోళ్లు లేక రైతులు అరిగోస పడుతుంటే పట్టించుకోవడం లేదని అన్నారు.
కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము రేవంత్ రెడ్డికి లేదా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి బహిరంగ లేఖ రాశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను అమలు చేయాలని కోరుతూ లేఖ రాస్తే ఎదురుదాడి చేయడం ఏంటని ప్రశ్నించారు.
రాష్ట్రంలోని రైతులను వెంటనే ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్నదాతలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకుంటే ఆందోళన తప్పదని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన హెచ్చరించారు.
నర్సంపేటలో ఉద్రిక్తతలకు కారణం కేంద్ర మంత్రి బండి సంజయ్ అని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్ మృతిని కేంద్ర మంత్రి రాజకీయం చేస్తున్న తీరు హేయనీయం, సిగ్గుచేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ స్వగ్రామం ముత్తోజిపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తీసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన తప్పే.. కాంగ్రెస్ చేస్తోందని అన్నారు.
కేసీఆర్, రేవంత్ భాషను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీఎం రేవంత్రెడ్డి మాట మార్చారని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట విభజన సమయంలో కాంగ్రెస్ తప్పిదాలతో యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని ఎంపీ తేజస్వి సూర్య చెప్పారని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. 2009లో కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటుకు సహకరించి మళ్లీ వెన్నక్కి తగ్గారని.. దీని గురించే తేజస్వి సూర్య మాట్లాడారని అన్నారు.