Home » Babu Mohan
ఈ ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా బరిలో దిగుతున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పష్టం చేశారు. అయితే తనను ఓడించడానికి బీజేపీ, టీడీపీ, జనసేన కలిశాయని ఆయన ఆరోపించారు.
Telangana: ప్రముఖ నటుడు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ (Babu Mohan) ప్రజా శాంతి పార్టీలో (Praja Shanthi Party) చేరారు. సోమవారం పార్టీ చీఫ్ కేఏపాల్ సమక్షంలో బాబుమోహన్ పార్టీ కండువా కప్పుకున్నారు. కొద్ది రోజుల క్రితం బీజేపీకి గుడ్బై చెప్పిన మాజీ మంత్రి.. ఈరోజు ప్రజాశాంతి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Telangana: బీజేపీకి మాజీ మంత్రి బాబుమోహన్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తనను వాడుకుని బీజేపీ పొమ్మనలేక పొగ పెడ్తోందని ఆరోపణలు చేశారు.
తనను రాజకీయంగా ఓడగొట్టేందుకు ఇన్ని కుట్రలు చేయాలి అని మంత్రి హరీశ్రావు ( Minister Harish Rao ) పై బీజేపీ జోగిపేట అభ్యర్థి బాబుమోహన్ ( Babu Mohan ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంగారెడ్డి జిల్లా: ఆందోల్ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాబు మోహన్కు ఆయన కుమారుడు ఉదయ్ బాబు మోహన్ ఊహించని షాక్ ఇచ్చాడు. ఆదివారం సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు సమక్షంలో ఉదయ్ బీఆర్ఎస్లో చేరారు.
బీజేపీ టికెట్ విషయంలో గత రోజులుగా వస్తున్న వార్తలపై సీనీనటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తన మీద మీడియాలో, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బాబు మోహన్కు టికెట్ వస్తుందో రాదో తరువాత విషయమని.. కొడుకుకు వస్తుంది, తండ్రి తండ్రికి రాదు అంటూ వార్తలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.