Home » Ayodhya Ram mandir
అయోధ్య, జనవరి 22: అయోధ్యలో సోమవారం(జనవరి 22, 2024)న జరిగిన బాల రాముడు ప్రతిష్ఠాపన కార్యక్రమానికి జీవీపీఆర్ ఇంజనీర్స్ చైర్మన్ వీరారెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. భవ్య మందిరంలో కొలువుదీరిన నీలిమేఘశ్యాముడిని దర్శించుకుని తరించారు. రామయ్యను దర్శించుకోవడంతో తమ జన్మ ధన్యం అయ్యిందని జీవీపీఆర్ ఇంజనీర్స్ చైర్మన్ వీరారెడ్డి అన్నారు.
Ayodhya Ram Mandir: శతాబ్ధాల నాటి కల సాకారమైంది. ఇన్నాళ్లూ గూడులేకుండా గుడారంలో ఉన్న అయోధ్య రామయ్య.. ఇప్పుడు భవ్య మందిరంలో కొలువుదీరారు. పండితుల వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండువగా రాములోరి ప్రతిష్ఠాపన కార్యక్రమం సాగింది. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, అయోధ్య శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్ట్ సభ్యులు సహా దేశ విదేశాల నుంచి సుమారు 7 వేల మందికి పైగా ప్రముఖులు ఈ కమనీయ వేడుకను కనులారా వీక్షించారు.
''ఈ భూమిమీద నా అంత అదృష్టవంతుడు ఎవరూ లేరు'' అని రామ్లల్లా విగ్రహ రూపకర్త అరుణ్ యోగిరాజ్ ఆనందం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని మైసురుకు చెందిన యోగిరాజ్ తయారుచేసిన రామ్లల్లా విగ్రహం సోమవారంనాడు అయోధ్యలోని ఆలయ గర్భగుడిలో కొలువుతీరింది.
అయోధ్యలో ప్రతిష్ఠాత్మక రామ మందిర్ శంకుస్థాపన కార్యక్రమం(జనవరి 22న) ఘనంగా పూరైంది. రేపటి నుంచి (జనవరి 23) సాధారణ భక్తుల కోసం రామాలయం తెరవబడుతుంది. ఈ మేరకు రామ మందిర తీర్థ క్షేత్ర కమిటీ భక్తుల దర్శనం, రాంలాల హారతి సమయాలను వెల్లడించింది.
నభూతో నభవిష్యతి అనే రీతిలో అయోధ్యలో బాల రాముని ప్రాణప్రతిష్ట అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. ''శ్రీరామచంద్ర కీ జై, మన రాముడొచ్చాడు'' అంటూ అతిథులు, రామభక్తుల హర్షాతిరేకాల మధ్య తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
అయోధ్య రామ మందిర్ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ ఆలయ నిర్మాణంలో భాగమైన కార్మికులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ కార్మికులపై గులాబీ పూలవర్షం కురిపించారు.
Ayodhya: రామ రాజ్యం అంటే అలా ఉండేది.. ఇలా ఉండేది అని పురాణాల్లో చదివి తెలుసుకోవడమే కానీ.. ప్రత్యక్షంగా చూసిన వారు లేరు. కానీ, ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తోంది. అవును, అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో మత సామరస్యం వెల్లివిరిసింది. ఏ రాముడి గుడి కోసం అయితే పోరాటం జరిగిందో.. అదే గడ్డంపై ఇప్పుడు మతాలన్నీ వెనక్కి వెళ్లి.. మానవత్వం ఫరిడవిల్లింది. రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠను స్వాగతిస్తున్నారు ముస్లిం మత పెద్దలు.
రాముడు పుట్టిన అయోధ్యలో రామాలయం నిర్మించాలన్న 500 ఏళ్ల నాటి ప్రజల కల నేటికి సాకారమైందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.1990లో కరసేవకులకు ఎదురైన అనుభవాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పుడు అయోద్యలో ఎలాంటి కర్ఫ్యూలు, కాల్పులు లేవన్నారు.
అయోధ్య రామ మందిర్(ram mandir) ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అతిథిగా హాజరైన పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బాలరాముడిని చూసి పులకించిపోయినట్లు తెలిపారు. వేడుకల్లో భాగంగా భావోద్వేగంతో తన కళ్ల నుంచి నీరు వచ్చినట్లు చెప్పారు.
అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. ప్రధాని మోదీకి పండితులు కండువా వేశారు. పూల దండ వేసి ఆశీర్వదించారు. ఓ పండితుడు బంగారు ఉంగరాన్ని జ్ఞాపికగా అందజేశారు.