Home » Ayodhya Ram mandir
గౌతం గంభీర్. ఈ పేరు వినగానే టీమిండియాకు గంభీర్ అందించిన రెండు ప్రపంచకప్లతోపాటు ఆయన అగ్రెసివ్ ప్రవర్తన కూడా గుర్తుకొస్తుంది. తన ఆటతో ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నాడో అదే స్థాయిలో వివాదాలను కూడా సంపాదించుకున్నాడు.
అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ రోజున బిడ్డలు జన్మించిన ఇళ్లల్లో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. ఆ రామచంద్రుడి ప్రసాదం అని పలువురు సంతోషం వెలిబుచ్చారు.
అయోధ్య బాలరాముడుకి ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ కుటుంబం భారీ విరాళం ప్రకటించింది. రూ.2.50 కోట్ల నగదును రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు అందజేస్తామని వెల్లడించింది.
లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా కమలం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. అయోధ్య ఎపిసోడ్ను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో బీజేపీ ఉంది. దీనిలో భాగంగానే దేశవ్యాప్తంగా అయోధ్యకు వెయ్యి ప్రత్యేక రైళ్లను వేయడం జరిగింది.
వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ దృష్టిసారించింది. గతంలో కన్నా ఎక్కువ లోక్ సభ సీట్లను గెలుచుకోవాలని భావిస్తోంది. అయోధ్య రాముడిని అస్త్రంగా మార్చుకోబోతుంది. తెలంగాణ నుంచి అయోధ్యకు నడిచే రైళ్లలో భక్తుల తరలించనుంది.
అయోధ్యలో బాలరాముడిని దర్శించుకునేందుకు మంగళవారం నాడు భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రధాన ద్వారం వద్దకు ఒకేసారి అధిక సంఖ్యలో వచ్చారు. తెల్లవారుజామున 3 గంటలకు భారీగా తరలివచ్చారు. ఆ సమయంలో తోపులాట జరిగింది.
కోట్లాది రామ భక్తుల కళ సోమవారంతో నెరవేరింది. శ్రీరామచంద్రుడు తన జన్మస్థలమైన అయోధ్యలో కొలువుదీరాడు. అయోధ్యలో నిర్మించిన రామ మందిరంలో బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యర్యంలో జరిగిన ఈ వేడుకకు 7 వేల మందికిపైగా అతిథులను ఆహ్వానించారు.
Ayodhya Ram Mandir Pran Pratishta Highlights: యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగిసింది. వేలాది ప్రముఖులు ఈ వేడుకకు హాజరవగా.. కోట్లాది జనులు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించారు. 500 ఏళ్ల నాటి కల నేటితో సాకారం అవడంతో అయోధ్య రామాలయం ప్రాంగణంతో పాటు.. యావత్ దేశ వ్యాప్తంగా జై శ్రీరాం నినాదం మార్మోగిపోయింది.
గత 500 సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న హిందువుల కల నేటికి (జనవరి 22) నెరవేరింది. అయోధ్యలోని రామమందిరం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా.. వేలాదిమంది అతిరథ మహారథుల మధ్య రామ్లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగింది.
అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ఉద్వేగభరిత ప్రసంగంలో రామాయణంలోని పలు పాత్రల విశిష్టతను గుర్తుచేశారు. ఆ పాత్రల్లోని అంకిత భావాన్ని, సందేశాన్ని అందిపుచ్చుకుని జాతి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.