Home » Ayodhya Prana Prathista
రాముడిని బీజేపీ ఎన్నికల అస్త్రంగా మార్చుకుందని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి ఆరోపించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని వివరించారు. హడావిడిగా 22వ తేదీన రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారని మండిపడ్డారు. దీనిని శంకరాచార్యులు, మఠాధిపతులు వ్యతిరేకించారని తెలిపారు.
ఈ నెల 22న జరగనున్న ‘ప్రాణప్రతిష్ఠాపన’ కార్యక్రమానికి ముందు కీలక ఘట్టం చోటుచేసుకుంది. సుమారు 550 ఏళ్ల తర్వాత అయోధ్య రామాలయం గర్భగుడిలో ‘రామ్ లల్లా’ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.