Home » AV Ranganath
‘‘చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపుపై మానవతా కోణంలో ఆలోచిస్తే సమాజమంతా బాధపడుతుంది. కొన్ని చోట్ల మనసు చంపుకొని పని చేయాల్సి వస్తుంది’’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు.
నగరంలో చెరువులు, కుంటలు, నాళాలు ఆక్రమించిన నిర్మాణాలు చేపట్టిన ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది హైడ్రా. ఏ క్షణం ఎక్కడ వాలిపోతుందో.. ఎవరి ఇల్లు కూలగొడుతుందోననే భయాందోళనతో ఉన్నారు.
హైడ్రా, ఐఎండీతో కలిసి పనిచేస్తుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అర్బన్ డిజాస్టర్స్ కో సంబంధించి ఐఎండీతో కలిసి పనిచేస్తుందని వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కనుమరుగైన చెరువులపై సంబంధిత శాఖ అధికారులతో చర్చించారు.
సహజవనరులను ప్రజలకు ఉపయోగపడే విధం గా చెరువులను సుందరీకరించడం ప్రస్తుతం అవసరమని హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath) అన్నారు. ఇటీవల గ్రేటర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో చెరువుల సుందరీకరణ అంశంపై ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ, కార్పొరేటర్లు మంజుల రఘునాధ్రెడ్డి అధికారులు చందానగర్(Chandanagar) సర్కిల్ పరిధిలోని బచ్చెకుంట, రేగుల కుంట చెరువుల సుందీకరణ పనులు చేపట్టాలని కోరారు.
ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను చెరబట్టిన వారిపై కన్నెర్ర చేసిన హైడ్రా(HYDRA).. తాజాగా రూటు మార్చింది. ఆక్రమణల కూల్చివేతలకు తాత్కాలిక విరామం ఇస్తూ.. చెరువులు, కుంటల పునరుద్ధరణకు రంగంలో దిగింది.
బెంగళూరులో హైడ్రా అధికారుల బృందం పర్యటన ముగిసింది. పర్యటన సందర్భంగా కర్ణాటక ట్యాంక్స్ కన్జర్వేషన్ అండ్ డెవల్పమెంట్ అథారిటీ (కేటీసీడీఏ) సీఈవో రాఘవన్తో శుక్రవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బృందం సమావేశమైంది.
గ్రేటర్ పరిధిలోని అక్రమ కట్టడాలన్నీ కూల్చివేసే అధికారాన్ని తెలంగాణ ప్రభుత్వం హైడ్రాకు ఇచ్చింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ చట్టంలో పలుమార్పులు చేసింది. జీహెచ్ఎంసీ చట్టంలో మున్సిపల్ శాఖ. 374B ప్రత్యేక సెక్షన్ చేర్చింది. దీంతో బల్దియాతో పాటు 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల పరిధిలో హైడ్రా దూకుడు పెంచనుంది.. ఇక నుంచి జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తారు.
ప్రభుత్వ అనుమతులున్న భవనాలను హైడ్రా(Hydra) కూల్చదని.. సర్వే నంబర్లు మార్చి, తప్పుడు సమాచారంతో అనుమతులు పొంది, భూములు, చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై మాత్రమే చర్యలు ఉంటాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) స్పష్టం చేశారు. నగరవాసులకు మెరుగైన జీవనాన్ని కల్పించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా వందరోజులు పూర్తి చేసుకున్నదని కమిషనర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కూకట్పల్లి(Kukatpally)లో హైడ్రా పేరు వింటేనే ఆక్రమణదారులు, ఫుట్పాత్ వ్యాపారుల గుండెలో వణుకు పుడుతోంది. హైడ్రా అధికారులను అడ్డుకునేందుకు ఏం చేయాలని, తమ వ్యాపారాలు పోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, స్వచ్ఛందంగానే తొలగించుకోవాల్సి వస్తుందా.. లేదంటే స్థానిక నాయకులతో చర్చించాలా అంటూ చిరు వ్యాపారులు చర్చించుకుంటున్నారు.
వర్షం పడితే నగరంలోని పలు ప్రాంతాలు నీట మునగడం, రహదారులు జలమయం కావడం వంటి సమస్యలకు ప్రధాన కారణం సరైన వరద ప్రవాహ వ్యవస్థ లేకపోవడంతో పాటు నాలాలు, స్ట్రామ్ వాటర్ డ్రైన్లలో వ్యర్థాలు తొలగించకపోవడమేనని అధికారులు గుర్తించారు.