Home » Assembly elections
బెంగాల్ ఎన్నికల పరిశీలకుడిగా ఉత్తరప్రదేశ్ ఐపీఎస్ అధికారి, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అజయ్ పాల్ శర్మ రంగంలోకి దిగడం, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిని హెచ్చరించడం సంచలనమవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
పశ్చిమబెంగాల్లో రెండో విడత పోలింగ్ స్వేచ్ఛగా, సజావుగా సాగేందుకు ఎన్నికల కమిషన్ కీలక నియామకం జరిపింది. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా పేరున్న ఉత్తరప్రదేశ్ క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మను ఎన్నికల పరిశీలకుడిగా నియమించింది.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్కు ప్రచారం సోమవారం సాయంత్రం 6 గంటలతో ముగుస్తోంది. బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చివరినిమిషంలో సుడిగాలి ప్రచారం సాగించారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ప్రచారానికి మరి కొద్ది గంటల్లోనే తెరపడనుంది. ర్యాలీలు, రోడ్షోలతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం సాగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సోమవారం నాడు బరాక్పూర్లో జరిగిన ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు.
ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాలు 'మరమరాల మిక్చర్' ప్రధానాంశంగా నడుస్తున్నాయి. మోదీ, మమతా బెనర్జీ మధ్య ఒకప్పుడు కేవలం ఆహారం, ఆరోగ్యం గురించి ఇదే మిక్చర్ మీద జరిగిన చర్చ, ఇప్పుడు ఇద్దరు అగ్రనేతల మధ్య ప్రధాన విమర్శనాస్త్రంగా మారింది.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంటోంది. రెండో విడత పోలింగ్కు సోమవారంతో ప్రచారం ముగియనుండటంతో ప్రధాన పార్టీలన్నీ బహిరంగ సభలు, రోడ్షోలతో ఊదరగొడుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారంనాడు వరుస బహిరంగ సభలు, రోడ్షోలతో ప్రచారం సాగించారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి అనుకూల పవనాలు వీస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తొలి విడత పోలింగ్లో భారీ ఓటింగ్తో టీఎంసీకి గట్టి దెబ్బ తగిలిందని, తుది విడత ముగిసేసరికి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.
పశ్చిమబెంగాల్లో కీలకమైన రెండో విడత పోలింగ్కు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌత్ 24 పరగణాల జిల్లాలోని భాంగర్లోని ఓ ఇంటి నుంచి సుమారు 100 నాటు బాంబులను పోలీసులు ఆదివారంనాడు స్వాధీనం చేసుకున్నారు.
చెన్నై నగరం నుంచి ఇతర నగరాలకు వెళుతున్న విమాన ఛార్జీ లు రెండున్నర రెట్లు పెరిగాయి. శాసనసభ ఎన్నికలు గురువారం ఒకేవిడతలో జరుగుతున్నాయి.
రాష్ట్రంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వివిధ పార్టీల నాయకులు, అభ్యర్థుల వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నాయకులు ప్రయాణించే హెలికాప్టర్లలోనూ సోదాలు జరుపుతున్నారు.