Home » Assembly elections
రాష్ట్రవ్యాప్తంగా ‘ఉంగలుడన్ స్టాలిన్’ పేరుతో ప్రారంభమైన ప్రజావిజ్ఞప్తుల శిబిరాలకు వస్తున్న జనాలను చూసి ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిస్వామికి వణకుపుట్టి, విమర్శల పేరుతో డీఎంకే ద్రావిడ తరహా పాలనకు విస్తృత ప్రచారం చేస్తున్నారని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎద్దేవా చేశారు.
బీజేపీ తదితర పార్టీల కలయికతో ఏర్పడిన పొత్తు పటిష్టమని, సొంత బలంతోనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని మాజీముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) మరోమారు ధీమా వ్యక్తంచేశారు.
ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 27న రాష్ట్రానికి విచ్చేయనున్నారు. గంగైకొండ చోళపురంలో జరిగే వేడుకల్లో ఆయన ముఖ్య అథిగా పాల్గొననున్నారు. ఐదు రోజులపాటు విదేశీ పర్యటన ముగించుకుని గురువారం ఆయన ఢిల్లీకి తిరిగొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరున రాష్ట్రంలో పర్యటించేందుకు వస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి.
తమ హైకమాండ్ అనుమతి లేకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎక్కువ సీట్లు కోరలేమని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై(TNCC President Selvaperunthagai) అన్నారు.
రాష్ట్రంలో రౌడీయిజం, దౌర్జన్యం, హత్యలు, దోపిడీలు, మాదకద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా జగుతోందని, ‘కమీషన్, కరప్షన్ నిర్విఘ్నంగా సాగుతోందని అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ధ్వజమెత్తారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ప్రభుత్వానికి ఉపాధ్యాయులు గుణపాఠం చెబుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ జోస్యం చెప్పారు.
వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోగా ఎన్డీఏలో చేరిక గురించి టీవీకే నుంచి వచ్చే వార్త కోసం వేచిఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్(BJP state president Nainar Nagendran) పేర్కొన్నారు.
వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, డీఎంకే పార్టీలతో పొత్తుపెట్టుకోకుండా ఒంటరిగానే బరిలోకి దిగాలని తమిళగ వెట్రి కళగం (టీవీకే) నిర్ణయింది.
రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా ద్రావిడ తరహా డీఎంకే ప్రభుత్వ పాలన చూసి ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు మెచ్చుకుంటున్నారని, గతంలో లేని విధంగా మూడువేలకు పైగా సుప్రసిద్ధ ఆలయాలకు మహాకుంభాభిషేకాలను జరిపించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు.
డీఎంకే పాలనపై తాను ఎలాంటి విమర్శలు చేయలేదని, భవిష్యత్తులోనూ ఆరోపణలు, విమర్శలు చేయబోనని ఎండీఎంకే నేత వైగో స్పష్టం చేశారు.