Home » Assam
సోషల్ మీడియా కారణంగా వివిధ ప్రాంతాలలో వెలుగులోకి వచ్చే కొన్ని సంఘటనలు ఉలిక్కిపడేలా చేస్తుంటాయి. ఇప్పుడూ అలాంటి సంఘటన అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. కన్నతల్లి మరణంచి ఆ మృతదేహం కంపు కొడుతున్నా అదే ఇంట్లో వారం రోజులపాటు ఉందొక కూతురు.
సాంకేతిక పరంగా ప్రపంచ దేశాలకు గట్టి పోటీనిస్తున్న ఈరోజుల్లోనూ మన దేశంలో బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించాల్సిన తల్లిదండ్రులే డబ్బులకు అమ్ముడుపోయి, మేజర్ కాకముందే..
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఢిల్లీతోపాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భూప్రకంపనలు వచ్చాయి.
బాల్య వివాహాలు అరికట్టే వరకు 'మియా'(Miya) సామాజికవర్గ ఓట్లు బీజేపీ(BJP)కి అవసరం లేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ(Himanta Biswa Sarma) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాల్య వివాహాలను వ్యతిరేకించి తమను తాము సంస్కరించుకునే వరకు చార్ ప్రాంతంలో ఉన్న మియా ప్రజల ఓట్లు పదేళ్ల వరకు అక్కర్లేదని స్పష్టం చేశారు.
అస్సాంలో ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీంతో ప్రజలంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో తెల్లవారుజామున 3:01 గంటల సమయంలో ధుబ్రి జిల్లాలో భూకంపం వచ్చింది.
అస్సాం(Assam)లోని జోర్హాట్ జిల్లాలో అటవీ శాఖ బృందంపై అడవి ఏనుగు దాడి చేయడంతో ఫారెస్ట్ ఆఫీసర్(Forest Officer) మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... జోర్హాట్లోని టిటాబోర్లోని బిజోయ్ నగర్ ప్రాంతంలో ఏనుగుల గుంపు ఆహారం కోసం అడవి నుండి బయటకు వచ్చినప్పుడు అటవీ శాఖ బృందం వాటిని తిరిగి అడవిలోకి తరిమికొట్టడానికి ప్రయత్నించింది.
పొలిటీషియన్లు ఎలాంటి రాజకీయాలు చేస్తారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించడంపై దృష్టి సారించకుండా.. అనవసరమైన విషయాలపై లేనిపోని రాద్ధాంతం చేస్తుంటారు. తమ ప్రత్యర్థుల్ని..
అస్సాంలోని కాచార్ జిల్లా సిల్చార్లో గల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో(ఎన్ఐటీ) ఓ విద్యార్థి ఆత్మహత్యకు నిరసనగా మిగతా విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది.
మెరుగైన విద్య అందించే పాఠశాలలు చాలా ఎక్కువ డబ్బు వసూలు చేస్తాయి. కానీ ఆ పాఠశాలలో మాత్రం డబ్బులు కట్టక్కర్లేదు. దానికి బదులుగా ప్లాస్టిక్ బాటిళ్లు స్కూల్లో డిపాజిట్ చేయాలి.
అసోం ముఖ్యమంత్రి హిమంత బస్వ శర్మ, లోక్సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్ మధ్య తలెత్తిన మాటల యుద్ధం గురువారంనాడు తారాస్థాయికి చేరింది. గొగోయ్ ఆరోపణలపై అమీతుమీ తేల్చుకోవాలనుకుంటున్నానని, కోర్టులోనే ఆయనను కలుస్తానని తాజా ట్వీట్లో శర్మ పేర్కొన్నారు.