Home » Ashok Gehlot
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. గతకొంత కాలంగా ఎడమొఖం పెడమొఖంగా ఉన్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్మ ధ్య దోస్తీ కుదర్చడంలో కాంగ్రెస్ అధిష్టానం సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ చేసిన వ్యాఖ్యలే ఈ పరిణామానికి బలం చేకూర్చుతున్నాయి.
రాజస్థాన్ శాసన సభ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. మరోసారి విజయం సాధించడం కోసం వ్యూహాలను రచించేందుకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో ఆ పార్టీ అగ్ర నేతలు గురువారం సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, యువ నేత సచిన్ పైలట్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు.
రాజస్థాన్ కాంగ్రెస్లో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య వైరం ఎప్పుడు ముగుస్తుందోనని ఆ పార్టీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.
ఈ ఏడాది చివర్లో జరిగే రాజస్థాన్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ (BJP) గెలుపు అవకాశాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొండితనం వల్లే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. మరిన్ని రాష్ట్రాలను కూడా బీజేపీ కోల్పోనుందని జోస్యం చెప్పారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ తీవ్ర అసహనానికి గురయ్యారు.
రాజస్థాన్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం నుంచి ప్రజలకు ఉచిత విద్యుత్ ఇస్తామని సంచలన ప్రకటన చేశారు....
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఆయన మాజీ డిప్యూటీ సచిన్ పైలెట్ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు సమసిపోలేదనే సంకేతాలు మరోసారి బయటకు వచ్చాయి. అవినీతి కేసులపై గెహ్లాట్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందేనని గెహ్లాట్ పునరుద్ఘాటించారు. తాను ఇప్పటికే అల్టిమేటం ఇచ్చానని, ఇవాళే చివరి రోజని చెప్పారు.
రాజస్థాన్ శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వర్గ విభేదాలను పరిష్కరించుకునేందుకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది.
కర్ణాటకలో సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య విభేదాలను ఇటీవల సమర్ధవంతంగా పరిష్కరించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇప్పుడు రాజస్థాన్ కాంగ్రెస్లో తలెత్తిన విభేదాల పరిష్కారానికి రంగంలోకి దిగారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఆయనతో విభేదిస్తున్న సచిన్ పైలట్ తో సోమవారంనాడు న్యూఢిల్లీలో విడివిడిగా సమావేశమవుతున్నారు.