Home » Ashada Bonala Jaathara
ఆషాడమాసం బోనాల సంబురాలతో పాటు అతివల చేతిలో గోరింటాకు పండుతుంది. అషాడ మాసంలో అతివలు చేతులకు, కాళ్లకు గోరింటాకు పెట్టుకోవడం ఆరోగ్యానికీ మంచిదిగా భావిస్తారు.
ఈనెల 28వ తేదీన జరగనున్న ఆషాఢం బోనాల జాతర(Ashadham bonala fair)కు ఆలయాలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే ఆయా ఆలయాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ కమిటీలు ప్రత్యేక చొరవ తీసుకొని భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ ఆషాఢ మాసంలో పురాణపండ శ్రీనివాస్ ఆర్షధర్మాల రమణీయ గ్రంధాన్ని ఆవిష్కరించనున్నట్లు సమాచారం. లక్షల కొలది భక్తులకు ఇష్టమైన శ్రీ సహస్రనామాలు రెండింటితో ‘లలిత , విష్ణు’ల వెలుగులతో ముఖపత్రం శ్రీరాజరాజేశ్వరీదేవి మంగళ చిత్రంతో, వెనుక అట్టపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంగళానుగ్రహం కలగాలనే పవిత్ర స్వఛ్చ వాక్యనిర్మాణంతో ఈ గ్రంధం చోటుచేసుకోవడం విశేషం.