Home » Artificial Intelligence
చైనా(china) వక్రబుద్ది అస్సలు మారడం లేదు. కుక్క తోక వంకర అన్నట్లుగా తయారైంది. భారత్ విషయంలో గతంలో పలు మార్లు దూకుడు చర్యలకు దిగిన డ్రాగన్ దేశం ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల(elections) వేళ మరోసారి తన వంకర బుద్దిని చూపించాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో దుశ్చర్యకు పాల్పడేందుకు చైనా సిద్ధమవుతుందని ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్(Microsoft) ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
వినియోగదారులకు ఎప్పటికప్పుడు మెరుగైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తున్న వాట్సప్ తాజాగా మరో అదిరిపోయే ఫీచర్తో ముందుకు వచ్చింది. ఇన్నాళ్లు క్రోమ్ బ్రౌజర్లో వేర్వేరు సైట్లను ఉపయోగించుకుని ఏఐ ఫొటోలను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉండేది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) వచ్చిన తర్వాత సాంకేతిక రంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. క్లిష్టమైన పనుల్ని సునాయాసంగా చేసేలా కొత్త యాప్స్ (Apps), టూల్స్ (Tools) పుట్టుకొస్తున్నాయి. కొన్ని సంస్థలైతే హ్యూమనాయిడ్ రోబోట్లను (Humanoid Robots) కూడా సిద్ధం చేశాయి. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాకు చెందిన కాగ్నిషన్ (Cognition) అనే స్టార్టప్ సరికొత్త సంచలనానికి పునాది వేసింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి.. కొన్ని ప్రైవేట్ సంస్థలు రోబోలను (Humanoid Robots) తయారు చేయడంలో నిమగ్నమయ్యాయి. తమ సత్తా చాటి, ఈ రంగంలోకి దూసుకుపోవాలన్న ఉద్దేశంతో పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ‘సారా’ మానవరూప రోబోను సిద్ధం చేయగా.. తాజాగా సౌదీ అరేబియాలోని (Saudi Arabia) QSS సిస్టమ్స్ ఒక మగ రోబోని తయారు చేసింది.
సాంకేతికతను వినియోగించుకోవడంలో ఎప్పుడూ ముందుండే బీజేపీ(BJP).. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ద్వారా ఓటర్లకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో 370 స్థానాలను గెలుచుకోవాలనే తపనతో ఉన్న ఆ పార్టీ.. దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి సారించింది.
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏఐ(Artificial Intelligence) ముచ్చటే వినిపిస్తోంది. మనిషి జీవితాన్ని అన్ని రకాలుగా ప్రభావితం చేసే శక్తి ఏఐకి ఉంది. ఇప్పుడిప్పుడే మానవ జీవితంలోకి ప్రవేశిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి నాస్కామ్ నివేదిక ఓ వైపు ఆసక్తికరంగా, మరోవైపు ఆందోళనకు గురి చేస్తోంది.
అయోధ్య రామ్ లల్లా ప్రాణ(Ayodhya Ram Mandir) ప్రతిష్ఠాపన తేదీ సమీపిస్తున్న వేళ.. అధికారులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇందుకోసం ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. అయోధ్య ఆలయ అధికారులకు ఈ మధ్యే ఓ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అయోధ్య మొత్తాన్ని భద్రతావలయంలోకి తీసుకొచ్చారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం దేశంలో క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో దేశంలోనే తొలిసారిగా అహ్మదాబాద్(ahmedabad)లో ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఏఐ నిఘా వ్యవస్థ అమల్లోకి వచ్చింది.
దేశంలో ఏఐ(artificial intelligence) టెక్నాలజీ వినియోగం ఏ మాత్రం తగ్గడం లేదు. గతంలో ఎక్కువగా విద్యా రంగం, తర్వాత వైద్యంలో విరివిగా ఉపయోగించారు. తాజాగా వివాహ వేడుకల వ్యాపారంలోకి కూడా ఏఐ రంగ ప్రవేశం చేసింది.
భారత్ జీపీటీ(Barath GPT) టెక్నాలజీ కోసం పని చేస్తున్నట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ(Akash Ambani) ప్రకటించారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. ఐఐటీ బాంబే, రిలయన్స్ జియో పరస్పర సహకారంతో భారత్ జీపీటీ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.