Home » AP Election Survey
ఏపీ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుంది.. ఎవరికి అధికారం ఇవ్వబోతున్నారు. ఓటరు ఆలోచన ఎలా ఉందనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఓటర్లు తమ తీర్పును రిజర్వ్ చేశారు. జూన్4న ఫలితం తేలనుంది. ఈలోపు ఏపార్టీ మెజార్టీ మార్క్ సాధిస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.
ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. అందరి దృష్టి కౌంటింగ్పైనే నెలకొంది. జూన్4 కోసం ఏపీ ప్రజలు నిరీక్షిస్తున్నారు. రాజకీయ పార్టీల నాయకులు మాత్రం ఓట్ల లెక్కింపు కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పోటీచేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు గ్రామాల వారీగా లెక్కలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో పోలింగ్ ముగిసిన వేళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఈ పోలింగ్ రోజుని రాష్ట్రంలో ఓ చారిత్రాత్మక దినంగా అభివర్ణించిన ఆయన..
నెల్లూరు నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి నారాయణ నామినేషన్ తిరస్కరించాలని దాఖలైన పిటిషన్పై ఇవాళ ఏపీ హైకోర్ట్లో విచారణ జరిగింది. నారాయణ వ్యక్తిగత అంశాలను అఫిడవిట్లో పేర్కొనలేదని హనుమంతరావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఇప్పటికే రిటర్నింగ్ అధికారి పిటిషన్ తిరస్కరించారని పిటిషన్ తరపు న్యాయవాది చెప్పారు.
ఏపీలో వరుసగా రెండోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని తెలిసినా.. తాము గత ఐదేళ్లుగా అమలు చేసిన కొన్ని సంక్షేమ కార్యక్రమాలే ఓట్లు తెచ్చిపెడతాయని వైసీపీ నాయకులు లెక్కలు వేస్తున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అభివృద్ధిని పక్కనపెట్టి.. ఓట్ల కోసమే అన్నట్లు రాష్ట్రం లోటుబడ్జెట్లో ఉన్నప్పటికీ ఉచిత పథకాలను ప్రవేశపెట్టారు. దీంతో ఏపీ అప్పులమయమైంది.
సీఎం జగన్ (CM Jagan) పోటీ చేస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టాలని మాజీ ఎంపీ, టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ (Kanakamedala Ravindra Kumar) కేంద్ర ఎన్నికల ముఖ్య కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. పులివెందులలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన లేఖ రాశారు.
జనసేన పార్టీకి (Janasena Party), రాజోలు నియోజకవర్గానికి (Razole Constituency) ఒక ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పుకోవడంలో సందేహం లేదు. ఎందుకంటే.. 2019 ఎన్నికల్లో ఆ ఒక్క అసెంబ్లీ స్థానంలోనే జనసేన గెలుపొందింది. పవన్ కళ్యాణ్పై (Pawan Kalyan) ఉన్న నమ్మకంతో.. రాజోలు నియోజకవర్గ ప్రజలు ఆ స్థానం నుంచి జనసేన తరఫున పోటీ చేసిన రాపాక వరప్రసాద్ని గెలిపించారు.
Pawan Vs RGV: పిఠాపురం (Pithapuram) నుంచి పోటీ చేస్తున్నట్లు సేనాని స్వయంగా చెప్పడంతో ఒక్కసారిగా ఏపీలో పొలిటికల్ సీన్ మారిపోయింది..
కుట్రలు, కుతంత్రాలు చేసే రాజకీయాలు మారాలని జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్(Sravan Kumar) అన్నారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వంలో దగాపడ్డ యువకుడు జనపల్లి శ్రీనివాసరావు అని చెప్పారు. డబ్బు, అధికార మదంతో వైసీపీ నేతలు విర్రవీగుతున్నారని మండిపడ్డారు. దళిత, రాజ్యాంగ రక్షణ కోసం దళిత సోదరుడు జనపల్లి శ్రీనివాసరావు తపన పడుతున్నారని చెప్పారు.
AP Elections 2024: సార్వత్రిక ఎన్నికలకు ముంగిట అధికారపక్షం ఒక్కసారిగా డీలా పడిపోయింది. ఆ పార్టీ ముఖ్య నేతల నుంచి కార్యకర్తల దాకా ఎవరిలోనూ ఎన్నికల సంరంభమే కనిపించడం లేదు..