Home » AP DGP
అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో జరిగిన ఘటన (Madanapalle Incident) తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమే సృష్టిస్తోంది. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. అసలేం జరిగింది..?..
రాష్ట్రంలో ఎవరైనా దాడులకు పాల్పడితే సహించేది లేదని డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. అది ఏ పార్టీ వారైనా సరే.. వదిలి పెట్టే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు.
Andhrapradesh: నేరాలను అదుపు చేయడం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... అనంతపురం, కర్నూలు రేంజ్ ఫీల్డ్ విజిట్ చేసినట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో సవాళ్ళను ప్రతి సవాళ్ళను పోలీసులు సమర్ధవంతంగా ఎదుర్కోంటున్నామన్నారు. పోలీసు డిపార్ట్మెంట్లో వాహనాలు పాతబడ్డాయని.. వాటిని అప్ గ్రేడ్ చేయడం జరుగుతుందన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లలో చాలా కుంభకోణాలు జరిగాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న (Buddha Venkanna) సంచలన ఆరోపణలు చేశారు. వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి దోచుకున్నట్లు ఆధారాలు ఉన్నాయని హాట్ కామెంట్స్ చేశారు.
ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu)తో డీజీపీ ద్వారకా తిరుమల రావు (DGP Dwaraka Tirumala Rao) ఈరోజు (శుక్రవారం) భేటీ అయ్యారు. బాపట్ల జిల్లా ఈపూరుపాలెం హత్య ఘటనపై సమాచారాన్ని సీఎం చంద్రబాబుకు డీజీపీ ద్వారకా తిరుమల రావు వివరించారు.
సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతూ సమాజంలో అశాంతి సృష్టిస్తున్నారన్నారు. మరి కొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారని.. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హరీష్ కుమార్ గెప్తా హెచ్చరించారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Election 2024) జరిగిన పోలింగ్ రోజు, ఆ తర్వాత మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy), ఆయన సోదరుడు సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు. పోలింగ్ కేంద్రాల్లో పిన్నెల్లి సోదరులు తెలుగుదేశం పార్టీ ఏజెంట్లపై హింసకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ పోలింగ్ ఏజెంట్ నోముల మాణిక్యాలరావు (Nomula Manikyala Rao) పిన్నెల్లి చేతిలో తీవ్రంగా గాయపడ్డారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల (AP Election 2024) కౌంటింగ్కు, ప్రస్తుత హింసాత్మక సంఘటనలకు నేపథ్యంలో జిల్లాలకు ప్రత్యేక పోలీస్ అధికారులు రానున్నారు. పోలింగ్ రోజు, అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనల నేపథ్యంలో ఉన్నతాధికారులను నియమించారు. ఈ మేరకు ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా (AP DGP Harish Kumar Gupta) శనివారం కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు జరిగిన పోలింగ్, ఆ మరుసటి రోజు నుంచి ఏపీలో జరిగిన అల్లర్లు, అరాచకాలపై మరోసారి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (DGP Harish Kumar Gupta)కు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) ఫిర్యాదు చేశారు.
పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో గల పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం (202) లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీ ప్యాట్ మిషన్లను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈవీఎం, వీవీప్యాట్లను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశారు. ఆ తర్వాత వారిని టీడీపీ ఏజెంట్ శేషగిరి రావు అడ్డుకున్నారు. ఆయనకు పిన్నెల్లి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.