Home » AP CM
ఏపీలో ‘కూటమి’ కొలువు తీరేందుకు సర్వం సిద్ధమైంది. నవ్యాంధ్ర నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఆయన కొత్త మంత్రివర్గ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈనెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి (Chandrababu Oath Ceremony) పెద్దసంఖ్యలో ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ మేరకు ఇప్పటికే గన్నవరం మండలం కేసరపల్లిలో సభా ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, ఎన్డీయే కూటమి సీఎంలు, సినిమా, రాజకీయ, వ్యాపారం, పలు రంగాలకు చెందిన ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానం పంపారు.
ఈనెల 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు (Chandrababu) ప్రమాణ స్వీకారానికి జరుగుతున్న ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. కార్యక్రమానికి ప్రధాని మోడీ (PM Modi), ఎన్డీఏ కూటమి సీఎంలు, దేశవ్యాప్తంగా ప్రముఖులు రానున్న నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ (Kesarapalli IT park) సమీపంలోని పన్నెండు ఎకరాల స్థలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి (Chandrababu Oath Ceremony) ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Election Results) ఊహించని విజయం సాధించిన కూటమి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు...
రాష్ట్రాన్ని విభజించి పదేళ్లు పూర్తయింది. సర్వం కోల్పోయిన అవశేష ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా నిలబెట్టేందుకు కేంద్రం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు కాలేదు.
రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ మొదలైంది. నైరుతి రుతుపవనాల విస్తరణ వేగంగా సాగుతోంది. రెండు, మూడు రోజుల్లో రాయలసీమకు వచ్చి, అతికొద్ది రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించనున్నాయి. వర్షాలు విస్తారంగా కురిస్తే పంటల సాగు ప్రారంభం కానున్నది.
మొన్నటి దాకా వలంటీర్లంతా తమ వారేనన్నారు. పార్టీ కోసం అడ్డగోలుగా వాడుకున్నారు. ఎన్నికల ముందు చాలామందితో రాజీనామా చేయించి మరీ ప్రచారం చేయించుకున్నారు. అవసరం తీరిపోవడంతో ఇప్పుడు వైసీపీ నేతలు మొహం చాటేస్తున్నారు. పాపం... వలంటీర్లు పావులుగా మారిపోయారు
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతి నేడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సేవలను ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటున్నాం. తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడైన ఆయన ఎంతో దార్శనికత గల నాయకుడు. సినీ, రాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.
ఉమ్మడి ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయి పదేళ్లు కావస్తోంది. ఇప్పటికీ రాష్ట్రాన్ని విభజన కష్టాలు వెంటాడుతున్నాయి. విభజన అనంతరం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడితప్పింది.