• Home » AP BJP

AP BJP

Pawan Kalyan: పవన్ విషయంలో బీజేపీ వైఖరి మారిందా? కారణాలు ఇవేనా?

Pawan Kalyan: పవన్ విషయంలో బీజేపీ వైఖరి మారిందా? కారణాలు ఇవేనా?

పరిస్థితులకు అనుగుణంగా ప్రస్తుతం సినిమాల్లో పవన్‌కు ఉన్న క్రేజ్‌ను ఉపయోగించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆయన్ను ఎన్డీఏ కూటమి సమావేశానికి ఆహ్వానించింది. మరోవైపు ఇన్ని రోజులు తనను పట్టించుకోకుండా ఇప్పుడు ఢిల్లీ పెద్దలు పిలవగానే వెళ్లాలా వద్దా అని ఆలోచించి చివరికి పవన్ పెద్దవాళ్లు పిలిచినప్పుడు వెళ్లడమే సంప్రదాయం అని భావించారని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.

BJP Vs YSRCP : మొదటి ప్రసంగంతోనే వైఎస్ జగన్‌ను ఏకిపారేసిన పురంధేశ్వరి.. కనీసం కౌంటర్ ఇవ్వడానికి వైసీపీ సాహసించట్లేదంటే..!?

BJP Vs YSRCP : మొదటి ప్రసంగంతోనే వైఎస్ జగన్‌ను ఏకిపారేసిన పురంధేశ్వరి.. కనీసం కౌంటర్ ఇవ్వడానికి వైసీపీ సాహసించట్లేదంటే..!?

అవును.. దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeswari) ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక సీన్ మారిపోయింది..! సోమువీర్రాజు (Somu Veerraju) అధ్యక్షుడిగా ఉన్నన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి.! మొదటి ప్రసంగంతోనే జగన్ సర్కార్‌ను ఏకిపారేశారు!. వైసీపీ సర్కార్ (YSRCP Govt) వైఫల్యాలను ఎత్తిచూపుతూ పురంధేశ్వరి చెడుగుడు ఆడేసుకున్నారు.!..

Daggubati Purandeswari: ఏపీలో జనసేన-బీజేపీ పొత్తుపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు...

Daggubati Purandeswari: ఏపీలో జనసేన-బీజేపీ పొత్తుపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు...

జనసేన ఎప్పటికీ మిత్ర పక్షమేనని కుండబద్దలుకొట్టినట్టు తేల్చిచెప్పారు. తద్వారా ఇరు పార్టీల మైత్రిపై అధ్యక్షురాలి హోదాలో స్వయంగా ఆమె క్లారిటీ ఇచ్చారు. జనసేన అధినేత పవన్‌తో సోమువీర్రాజు మాట్లాడుతూనే ఉండేవారని, జనసేనతో సమన్వయంతో ముందుకు వెళ్తామని పురంధేశ్వరి చెప్పారు. జనసేన తమకు ఎప్పటికీ మిత్ర పక్షమేనని అన్నారు. తద్వారా జనసేన-బీజేపీ మైత్రి విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని, ఎన్నికల్లో కూడా కలసి వెళ్లే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చారు.

Nagotu Ramesh Naidu: వైసీపీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే..

Nagotu Ramesh Naidu: వైసీపీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే..

వైసీపీ అవినీతి పాలనకు అంతం పలికే రోజులు దగ్గర పడ్డాయని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు.

Purandeswari: నడ్డాను కలిసిన తర్వాత పురంధేశ్వరి ఏమన్నారంటే..!

Purandeswari: నడ్డాను కలిసిన తర్వాత పురంధేశ్వరి ఏమన్నారంటే..!

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కలిశారు. అధ్యక్షురాలిగా నియమించడంపై నడ్డాకు పురంధేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకానికి నడ్డాకు కృతజ్ఞతలు తెలిపినట్లు పురంధేశ్వరి వెల్లడించారు.

Purandeswari: పురందేశ్వరికి ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించడంపై రెండు రకాల చర్చలు..!

Purandeswari: పురందేశ్వరికి ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించడంపై రెండు రకాల చర్చలు..!

పురందేశ్వరికి బీజేపీ ప్రాధాన్యం ఇవ్వటంపై రెండు రకాల చర్చలు కొనసాగుతున్నాయి. టీడీపీని దగ్గర చేసుకునే క్రమంలో ఇదో ప్రయత్నంగా అత్యధికులు భావిస్తున్నారు. కాగా కమ్మ సామాజికవర్గం.. ప్రధానంగా టీడీపీ శ్రేణుల్లో అయోమయ స్థితిని కల్పించి వైసీపీకి ఉపయోగపడేందుకే బీజేపీ పురందేశ్వరికి పదవిని ఇచ్చిందన్న అనుమానాలు వ్యక్తం చేసేవారు లేకపోలేదు.

Somu Veerraju: పవన్ కారణంగానే వీర్రాజుకు పదవి పోయిందా?

Somu Veerraju: పవన్ కారణంగానే వీర్రాజుకు పదవి పోయిందా?

సోము వీర్రాజు వైఖరిపై బీజేపీ అధిష్టానం వద్ద పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం ఉంది. అంతేకాకుండా సీఎం రమేష్, సుజనా చౌదరి, సత్యకుమార్ లాంటి బీజేపీ నేతలు వీర్రాజుపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

Telugu States BJP : ఏపీలో కిరణ్ రెడ్డికి.. తెలంగాణలో ఈటలకు కీలక పదవులు.. ఈ ఇద్దరికే ఎందుకంటే..!?

Telugu States BJP : ఏపీలో కిరణ్ రెడ్డికి.. తెలంగాణలో ఈటలకు కీలక పదవులు.. ఈ ఇద్దరికే ఎందుకంటే..!?

అవును.. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకత్వం (BJP High Command) భారీగా మార్పులు, చేర్పులు చేసింది. ముఖ్యంగా తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో గులాబీ బాస్ కేసీఆర్‌ను (CM KCR) మూడోసారి ముఖ్యమంత్రిని కానివ్వకూడదని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా వ్యూహాత్మకంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని మార్చింది.

AP BJP New Chief: ఏపీకి పురంధేశ్వరి, తెలంగాణకు కిషన్ రెడ్డి..

AP BJP New Chief: ఏపీకి పురంధేశ్వరి, తెలంగాణకు కిషన్ రెడ్డి..

ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియమితులయ్యారు. చడీ చప్పుడు కాకుండా ఏపీ అధ్యక్షుడి పదవి నుంచి సోమువీర్రాజును తొలగించిన అధిష్టానం.. కొత్త అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన విడుదలైంది. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిందిగా సోముకు అధిష్టానం ఆదేశించింది.

Somu Veerraju : మీ టర్మ్ అయిపోయింది.. మిమ్మల్ని తొలగిస్తున్నామంటూ సోము వీర్రాజుకు జేపీ నడ్డా సడెన్ షాక్..

Somu Veerraju : మీ టర్మ్ అయిపోయింది.. మిమ్మల్ని తొలగిస్తున్నామంటూ సోము వీర్రాజుకు జేపీ నడ్డా సడెన్ షాక్..

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును తొలగించారు. ఏమాత్రం చడీచప్పుడు లేకుండా ఇది జరిగిపోయింది. ఇటీవలి కాలంలో మన ఫోకస్ అంతా ఎంతసేపూ తెలంగాణ మీదే ఉంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి. అధిష్టానం నుంచి బండి సంజయ్‌కు కాల్ రావడం.. ఆయన హుటాహుటిన నిన్న హస్తినకు బయలుదేరి వెళ్లడం చకచకా జరిగిపోయాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి