Home » Annamalai
BJP: తమిళనాడులోని ఆలయాల నిర్వహణపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 తమిళనాడులో బీజేపీ అధికారంలోకి వస్తే దేవాదాయ శాఖ నుంచి అన్ని ఆలయాలను విముక్తి చేస్తామన్నారు.
కేంద్ర హోం శాఖామంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్షా(Senior BJP leader Amit Shah) ఈ నెల 26న ఒకరోజు రాష్ట్రానికి రానున్నారు. ఆయన కోవై జిల్లా వెలయంగిరి ప్రాంతంలోని ఈషా ఆశ్రమంలో జరిగే శివారాత్రి వేడుకల్లో పాల్గొంటారు.
పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా లేకపోయినా డీఎంకే ప్రధాన కార్యాలయమైన అన్నా అరివాలయం కూల్చివేసేంత వరకు తాను రాష్ట్రంలోనే ఉంటానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) శపథం చేశారు.
రాష్ట్రంలోని రైతుల పంట రుణాలను మాఫీ చేసేందుకు డీఎంకే ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
తమిళనాడు(Tamil Nadu) ప్రభుత్వం రుణంగా పొందిన రూ.10 లక్షల కోట్లు తిరిగి చెల్లించేందుకు మరికొన్నేళ్లు పడుతోందని, డీఎంకే ప్రభుత్వం కనీస అవసరాలకు ఈ రుణాన్ని వెచ్చించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) వ్యాఖ్యానించారు.
ఈరోడ్ ఈస్ట్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే, డీఎండీకే ప్రకటించగా, తాజాగా బీజేపీ కూడా ఎన్నికలను బాయ్కాట్ చేస్తున్నట్టు ప్రకటించింది.
ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
తమిళనాడులో ఉన్న అన్నా యూనివర్శిటీకి చెందిన లైంగిక వేధింపుల కేసులో న్యాయం చేయాలంటూ, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ నిరసనలో భాగంగా, ఆయన స్వయంగా తన ఇంటి బయట ఆరు కొరడా దెబ్బలు కొట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వరద బాధితులను ఆదుకోవడంలో డీఎంకే ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) ఆరోపించారు. టి.నగర్లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయమైన కమలాలయంలో సోమవారం ఉదయం అన్నామలై అధ్యక్షతన పార్టీ కేంద్ర కమిటీ నిర్వాహకుల సమావేశం జరిగింది.
టంగ్స్టన్ సొరంగం ఏర్పాటును విరమించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి(Union Minister Kishan Reddy)కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(Annamalai) వినతిపత్రం సమర్పించారు. ఈ విషయమై త్వరలో ఆశించిన ప్రకటన వెలువడుతుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని అన్నామలై తెలిపారు.