Home » Annamalai
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు అన్నామలై స్పందించారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడమే తన పాత్ర అని, అది తన బాధ్యత అని చెప్పారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 27 మంది పార్టీ అభ్యర్థులను బీజేపీ శుక్రవారంనాడు ప్రకటించింది. కీలక నేతలైన పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు నాగేంద్రన్, కేంద్ర మంత్రి ఎల్ మురుగన్, తమిళిసై సౌందరరాజన్కు పార్టీ టిక్కెట్ దక్కినప్పటికీ, పార్టీ మాజీ అధ్యక్షుడు, కీలక నేత కె.అన్నామలైకి ఈ జాబితాలో చోటుదక్కలేదు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ-అన్నాడీఎంకే మధ్య సీట్ల పంపకాలపై బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాల సమాచారం. దీనిపై ఢిల్లీలోని పార్టీ అధిష్ఠానానికి లేఖ రాసినట్టు చెబుతున్నారు.
శాసనసభ ఎన్నికల్లో అన్నామలై పోటీచేయాలని బీజేపీ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ విజ్ఞప్తి చేశారు. అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో బీజేపీకి 27 సీట్లు కేటాయించారు.
తంజావూరు జిల్లా స్వామిమలైలో స్వామినాథస్వామి ఆలయంలో కొత్తగా రెండు లిఫ్టులు ఏర్పాటు చేసేందుకు రూ.3.55కోట్లు అవసరమా? అని తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ప్రశ్నించారు.
సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో తమ పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశాలే లేవని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై స్పష్టం చేశారు. పార్టీపరంగా రెండు మహానాడులు నిర్వహించి జనసమీకరణ చేసినంత మాత్రాన ఆ జనం టీవీకేకు ఓట్లు వేస్తారనే గ్యారెంటీ లేదని, జనాన్ని చూసి విజయ్ మోసపోకూడదన్నారు.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఇవాళ(సోమవారం) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
తమిళనాడు బీజేపీలో అంతర్గత కలహాలకు చెక్ పెట్టి కూటమి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్షా రాష్ట్ర బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్ర రాజకీయ పరిస్థితులను వివరించేందుకు అమిత్షాతో రాష్ట్ర బీజేపీ నేతలు న్యూఢిల్లీలో బుధవారం భేటీ అయ్యారు.
క్రీడాకారులు ఓటమిచెందితే క్రుంగి పోకూడదని, విజయం కోసం తీవ్రంగా పోరాడాలని, చివరకు ఓటములే విజయానికి సోపానాలవుతాయని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై పేర్కొన్నారు. పుదుకోట సమీపం కీరనూరు వద్ద గన్ షూటింగ్ పోటీల్లో గెలిచిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు.
బీజేపీ ఎవరినీ మోసం చేసే పార్టీ కాదని, అలాగని మోసపోయే పార్టీ కాదని బీజేపీ నేత అన్నామలై తెలిపారు. కోయంబత్తూర్ నుంచి నగరానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... మా పార్టీకి ఒక లక్షణం ఉందని, మేము ఎవరినీ ఓడించమని, ఏ పార్టీని కిందకు నెట్టి ఎదగాలని కోరుకోమన్నారు.