Home » Andhrapradesh
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం కలచివేసిందని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి అన్నారు. టౌన్ బ్యాంక్లో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. బస్సుల నిర్మాణంలో లోపంవల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని కొందరు మాట్లాడడం బాధాకరమని అన్నారు.
శుక్రవారం తెల్లవారుతుండగానే పిడుగులాంటి వార్తతో నగర వాసులు ఉలిక్కిపడ్డారు. నగరం నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్(Vemuri Kaveri Travels) బస్సు కర్నూలు జిల్లాలో ప్రమాదానికి గురై.. 19 మంది సజీవ దహనమయ్యారు.
నకిలీ బంగారం అంటగట్టి కొరిటెపాడుకు చెందిన దంపతులను మోసగించి వారి నుంచి రూ. 12 లక్షలు తీసుకున్న కర్నాటక రాష్ట్రానికి చెందిన ఐదుగురు సభ్యుల ముఠాలో ఇద్దరిని గుంటూరు అరండల్పేట పోలీసులు అరెస్టు చేశారు.
‘రాష్ట్ర పురోభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అవాకులు.. చెవాకులు.. పేలుతున్నావు.. మతిభ్రమించిందా..? అంటూ మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిపై మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మండిపడ్డారు.
నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు అసత్యప్రచారాలు చేసే వైసీపీ నాయకులను కాలర్ పట్టుకుని నిలదీయాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు.
నాణ్యమైన మద్యమే వినియోదారుడికి చేరాలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొన్న వెంటనే దుకాణం వద్దే మద్యం చెక్ చేసుకునేందుకు వీలు కల్పించింది. ఈక్రమంలోనే ఓ సరికొత్త యాప్ను తీసుకువచ్చింది.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జీఎస్టీ గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మండిపడ్డారు. జీఎస్టీ 2.0ని కాంగ్రెస్ రాష్ట్రాలు కూడా అంగీకరించిన విషయం రాహుల్ గాంధీకి తెలియదా? అని పీవీఎన్ మాధవ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
డిజిటల్ బుక్ పేరుతో వైసీపీ బెదిరింపులకు దిగుతోందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు వెంకటాపురంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
ఓ వివాహానికి హాజరైన కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు స్విమ్మింగ్లో మునిగి మృతి చెందిన సంఘటన సోమవారం మడకశిరలో జరిగింది. బంధువులు తెలిపిన వివరాల మేరకు కర్ణాటక రాష్ట్రం హాసన్కు చెందిన బాబ్జాన్(35) మున్వర్ బాషా(27) మడకశిరలో ఆదివారం జరిగిన తమ బంధువుల వివాహానికి హాజరయ్యారు.
ప్రస్తుతం మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న పీలేరు త్వరలో మున్సిపాలిటీగా అవతరించనున్నట్లు తెలుస్తోంది. దినాదినాభివృద్ధి చెందుతున్న పీలేరును అభివృద్ధి పథంలో నిలపాలంటే మున్సిపాలిటీగా చేయక తప్పదనే అభిప్రాయంతో ఎమ్మెల్యే నల్లారి కిశోర్కుమార్రెడ్డి ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారని టీడీపీ నాయకులు చెబుతున్నారు.