Home » Anantapur urban
శ్రీచైతన్య పాఠశాలల ఉపాధ్యాయులుగా ఎస్కేయూ విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. ఈ మేరకు సోమవారం ఇనచార్జ్ వీసీ ప్రొఫెసర్ అనిత, రిజిస్ర్టార్ రమే్షబాబు విద్యార్థులకు నియామక పత్రాలందజేసి అభినందించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అయలు చూయాలని, లేని పక్షంలో ఉద్యమాలు తప్పవని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ హెచ్చరించారు. సోమవారం స్థానిక వాసవీ కల్యాణమండపంలో సీపీఐ మండల మహాసభలు నిర్వహించారు.
వాతావరణ పరిస్థితులతో పాటు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు చేయాల్సి ఉందని విశ్రాంత వైస్ చాన్సలర్, సీఆర్ఐడీఏ డైరెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు.
మాకు విమానశ్రం వద్దు.. మాభూములే కావాలంటూ ఇనచార్జి కలెక్టర్ శివనారాయణశర్మకు రైతులు విన్నవించారు. ఇటీవల కూడేరు ప్రాంతంలో ఎయిర్పోర్ట్ వస్తుందని, ఇందుకు అధికారులు భూములు గుర్తిస్తున్నారని, మీడియా, సోషల్మీడియాలలో పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది.
బాలలను, వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ధర్మవరం సీనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి గీతావాణి పేర్కొన్నారు. మండలంలోని యర్రోనిపల్లిలో శనివారం ఆర్డీటీ, ధర్మవరంలీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు విశ్వహిందూ పరిషత ఆధ్వర్యంలో శ్రీరామ ఉత్సవ సమితిని ఏర్పాటు చేశారు. పాతూరు వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం ఆవరణలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కుర్లపల్లి రంగాచారి, హరిశ్చంద్ర ఘాట్ అధ్యక్షుడు తిరువీఽ దుల జగదీష్కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
జిల్లాకేంద్రంలోని పాత ఆర్డీఓ కార్యాలయం ఆవరణంలో ఉన్న గోదాములలో భద్రపరిచిన ఈవీఎం లను జాయింట్ కలెక్టర్ శివనారాయణ్ శర్మ శనివారం తనికీ చేశారు. అదికారులు, రాజకీయపార్టీల ప్రతినిధుల సమక్షంలో తలుపులు తీయించి ఈవీఎంలను పరిశీలించారు.
సిరులు కురిపించిన అరటి సాగు ప్రస్తుతం ఎండ తీవ్రకు బాగా దెబ్బతింటోంది. చెట్టు మీదనే అరటి గెలలు నల్లగా మారుతున్నాయి. ఎండలకు తోడు రాత్రి పూట చిన్న పాటి ఈదురు గాలులకు అరటి గెల బరువు వల్ల చెట్లు నేలకు ఒరిగిపోతున్నాయి. దీంతో పాటు అమాంతం ధరలు పడిపోవడంతో, కాయలను కోసే వ్యాపారులు లేక పోవడం వల్ల అరటి సాగుచేసిన రైతులు రూ. లక్షలు నష్టపోతున్నారు.
నియోజకవర్గంలోని మండలాల్లో వేసవి కా లంలో నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక నిధులు ఇవ్యాల ని ఉప ముఖ్యమంత్రి పవనకల్యాణ్కు ఎమ్మె ల్యే బండారు శ్రావణిశ్రీ వినతి పత్రం అందజేశా రు. ఆమె గురువారం అసెంబ్లీ సమావేశాల అ నంతరం ఉప ముఖ్యమంత్రిని ఆయన చాంబర్లో కలిశారు.
ఏపీ సూపర్ ఫుట్బాల్ కప్-2025 పోటీలు ప్రారంభమయ్యాయి. స్థానిక ఆర్డీటీ స్టేడియం లో గురువారం ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సాయికృష్ణ, ఏపీ పుట్బాల్ అసోసి యేషన రాష్ట్ర అధ్యక్షుడు కోటగిరి శ్రీధర్, ఉపాధ్యక్షుడు సరిపూటి వేణు గోపాల్ పోటీలను ప్రారంభించారు. తుంగభద్ర జట్టుపై పెన్నా జట్టు 4 గోల్స్ తేడాతో విజయం సాధించగా.... నల్లమల జట్టుపై కోరమాండల్ జట్టు 2 గోల్స్ తేడాతో, గోదావరిపై కొల్లేరు 3గోల్స్, విశాఖపై వంశధార జట్టు 3 గోల్స్ తేడాతో గెలుపొందాయి.