Home » Anagani Satya Prasad
Andhrapradesh: దేశ స్వతంత్రం కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారని రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. విశాఖ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి అనగాని ముఖ్య అతిధిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.
Andhrapradesh: పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డిపై మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘నీ ఐదేళ్ల పాలనలో చేసిన మంచి అంటే ప్రజల భూములను కబ్జా చేయడం... ప్రశ్నించిన వారిని చంపేయడమా జగన్ రెడ్డి. నీవు అంతగా ప్రజలకు మంచి చేసి ఉంటే నీ పార్టీని ఎందుకు అత్యంత ఘోరంగా 11 సీట్లకే పరిమితం చేశారు’’ అని ప్రశ్నించారు.
గత వైసీపీ ఐదేళ్ల పాలనలో రౌడీయిజం చేసిన మాజీ మంత్రి జోగి రమేశ్ ఇవాళ నీతులు చెబుతున్నారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో అడ్డగోలుగా తప్పుడు పనులు చేసి ఇప్పుడు అడ్డంగా దొరికిపోయాక కులప్రస్తావన తెస్తున్నారంటూ అనగాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఫిర్యాదులు వచ్చాకే ఏసీబీ అధికారులు చర్యలు చేపట్టారని మంత్రి చెప్పుకొచ్చారు.
Andhrapradesh: ఒరిజనల్ అసైనీలకు లబ్ది చేకూర్చేందుకే ఫ్రీ హోల్డ్ చేసిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను మూడు నెలల పాటు నిలిపివేసినట్లు రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు కుట్ర పూరితంగా ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను చౌకగా కొట్టేశారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను ఆగస్టు 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఏపీ రెవెన్యూ, రిజిస్ర్టేషన్స్ అండ్ స్టాంప్స్ మంత్రి అనగాని సత్య ప్రసాద్ ప్రకటించారు. ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సులు జరుగుతాయని తెలిపారు.
Andhrapradesh: జగన్ను ప్రజలు మాత్రమే కాదు.. ఆయన పార్టీ నేతలూ భరించలేకపోతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తోందన్నారు. ఇచ్చిన హామీల్లో కేవలం 13 శాతం మాత్రమే..
మదనపల్లె ఫైళ్ల దహనం వ్యవహారంపై ప్రభుత్వ, విపక్ష పార్టీ వైసీపీ నేతల మధ్య పరస్పర విమర్శల పర్వం కొనసాగుతోంది. తాజాగా మంత్రి అనగాని సత్య ప్రసాద్ స్పందించారు. ‘‘తిన మరిగిన కోడి ఇల్లెక్కి కూసినట్లుగా ఉంది మాజీ మంత్రి పెద్దిరెడ్డి తీరు’’ అంటూ మంత్రి వంగ్యాస్త్రాలు సంధించారు.
మదనపల్లె సబ్ కలెక్టరేట్లో జరిగిన ఫైళ్ల దగ్ధం ఘటనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉండొచ్చని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అనుమానం వ్యక్తం చేశారు...
బాపట్ల జిల్లా: అఖండ మెజార్టీతో గెలిపించిన రేపల్లె నియోజకవర్గం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని టీడీపీ సీనియర్ నేత, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు. ఈ సందర్బంగా మంగళవారం మంత్రి రేపల్లెలో మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి కుంటుపడిందన్నారు.
అమరావతి: సీఎం జగన్ రెడ్డి స్వార్థ రాజకీయాల వల్లే పెన్షన్ల పంపిణీ బాధ్యత నుంచి వాలంటీర్లను ఎన్నికల కమిషన్ తప్పించిందని తెలుగుదేశం ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. ఈసీ సంక్షేమ పథకాలు ఆపమని చెప్పిందా? అని ప్రశ్నించారు.