Home » Anagani Satya Prasad
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన జగన్కు ఆస్తులు సృష్టించడం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.
వైసైీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేతకాని తనం వల్లే పదో తరగతిలో ఉత్తీర్ణతా శాతాలు ఘోరంగా పడిపోయాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. గాడితప్పిన విద్యా వ్యవస్థను యువ నేత నారా లోకేష్ అహర్నిషలు కష్టపడి దారిలో పెడుతుంటే చూసి సహించలేక పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని మండిపడ్డారు.
కాకినాడ పోర్టులో ప్రధాన వాటాను లాక్కొని అరబిందో వాళ్లకు కట్టబెట్టడం జగన్ రెడ్డి అరాచకానికి ఉదాహరణ అని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ఈనెల ఆరో తేదీ నుంచి జరగనున్న రెవెన్యూ సదస్సుల్లో వైసీపీ నేతల భూ దందాలపై కూడా ప్రజలు ఫిర్యాదులు ఇవ్వవచ్చని అన్నారు.
కళంకిత కార్పొరేటర్లను పక్కన పెట్టి, తక్కినవారిని పార్టీలో చేర్చుకునేందుకు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్(in-charge minister Anagani Satya Prasad) తెలిపినట్టు తెలిసింది. మంచి రోజు చూసుకుని పార్టీలో చేరేందుకు రావాలని సూచించినట్లు సమాచారం.
Andhrapradesh: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్పై మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. సూపర్ సిక్స్ పథకాల అమల్లో భాగంగా మరో రెండు పథకాలైన అమ్మ ఒడి, ఉచిత బస్సు పథకానికి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించండం సంతోషకర విషయమన్నారు. రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చేందుకు నీటిపారుదల శాఖకు గత ప్రభుత్వం కంటే రెండు రెట్ల అదనపు నిధులు...
చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ పాలనతోపాటు రాష్ట్రంలోని పలు అంశాలపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. దీనిపై మంత్రి అనగాని సత్య ప్రసాద్ స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గొప్ప మైలురాయిగా నిలుస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. భూములు కబ్జా చేసే వారి గుండెల్లో ఈ చట్టం రైళ్లు పరిగెత్తిస్తుందని చెప్పారు.
జగన్ ప్రభుత్వంలో హార్టికల్చర్ , డ్రిప్ ఇరిగేషన్ వంటివి అన్నింటినీ గాలికొదిలేశారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. రాయలసీమ బిడ్డ అని చెబుతూనే ఇరిగేషన్ను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. రాయలసీమకు తీరని అన్యాయం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు.
Andhrapradesh: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మంత్రులు శ్రీవారి సేవలో తరించారు. మంత్రులకు స్వాగతం పలికిన ఆలయ అధికారులు.. దర్శనానంతరం శ్రీవారి లడ్డూ ప్రసాదాలను వారికి అందజేశారు. అలాగే నిర్మాత నాగ వంశీ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Andhrapradesh: కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి అనగాని సత్యప్రసాద్ గట్టి కౌంటర్ ఇచ్చారు. గత ఐదేళ్లలో 2 లక్షలకు పైగా కేసులు నమోదైతే.. పట్టించుకోని జగన్ శాంతిభద్రతలపై మాట్లాడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు.