Home » Anagani Satya Prasad
Minister Anagani Sathya Prasad: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మంత్రి అనగాని సత్య ప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. మంగళంపేట అటవీ శాఖ భూ ఆక్రమణలపై రెండు వారాల వ్యవధిలో నివేదిక వస్తుందని తేల్చిచెప్పారు.అధికారులతో పాటు పెద్దిరెడ్డి కుటుంబంపైనా చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.
Pancha Gramala Samasya: విశాఖపట్నం జిల్లాలోని సింహచలం పంచగ్రామాల సమస్య త్వరలో పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడారు.
అమరావతి: తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రాష్ర్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గురువారం ఉదయం తిరుపతికి బయలుదేరారు. ఉదయం 9.45 గంటలకు రుయా ఆసుపత్రికి చేరుకొని గాయాలపాలైన భక్తులను మంత్రి అనగాని పరామర్శించనున్నారు. తొక్కిసలాటలో ఆరుగురు చనిపోవడం తన మనసును తీవ్రంగా కలిచివేసిందన్నారు.
Andhrapradesh: తెలుగులోనే ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. తెలుగు భాషాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 22ఏ జాబితాలో ఉన్న పేదల భూములపై నిషేధం ఎత్తివేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.
Anagani Satyaprasad: రెవెన్యూ సదస్సులో అధికారులపై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ సదస్సుల్లో అర్జీల పరిష్కారంపై ప్రజలు సంతృప్తిగా లేరన్నారు. ఇప్పటి వరకు పరిష్కరించిన అర్జీల్లో సగం మంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. 2016లో అసెంబ్లీలో తాను ప్రస్తావించిన 22ఏ సమస్యకే ఇంత వరకు అధికారులు పరిష్కారం చూపలేదని ఫైర్ అయ్యారు.
Andhrapradesh: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన కె. విజయానందకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. 1992 బ్యాచ్కు చెందిన బీసీ అధికారికి ముఖ్యమంత్రి చంద్రబాబు టాప్ పోస్ట్ ఇచ్చారన్నారు. బడుగు బలహీన వర్గాల పట్ల తన చిత్తశుద్ధిని మరోసారి నిరూపించుకున్నారన్నారు.
Andhrapradesh: రాష్ట్రంలో వైసీపీ ర్యాలీపై మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ పాలనలో రాష్ట్ర విద్యుత్ రంగంపై దాదాపు లక్షా 30 వేల కోట్ల రూపాయల భారాన్ని మోపిన జగన్ ఇప్పుడు చిలకపలుకులు పలుకుతున్నారని మండిపడ్డారు. యూనిట్కు ఐదు రూపాయలకు దొరికే విద్యుత్కు బదులు 8 నుంచి 14 రూపాయల వరకు కొనుగోలు చేసి ప్రజలపైన జగన్ రెడ్డి మోయలేని భారాన్ని మోపారన్నారు.
Manmohan singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపట్ల ఏపీ మంత్రులు, ఎంపీ సంతాపం తెలియజేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన ఘనత మన్మోహన్ సింగ్ దే అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
ఎన్డీయే ప్రభుత్వంలో ఎవరిపైనా కక్షసాధింపు చర్యలు ఉండవని, చట్టపరంగా మాత్రమే చర్యలు ఉంటాయని మంత్రి అనగాని చెప్పారు. పంచ గ్రామాల సమస్య, 22-ఏ సమస్య ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఆ సమస్యలకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని మంత్రి చెప్పారు.