Home » Allahabad High Court
జ్ఞానవాపి దక్షిణ సెల్లార్లో హిందువుల ప్రార్ధనలకు అనుమతిస్తూ వారణాసి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై 'స్టే' ఇచ్చేందుకు అలహాబాద్ హైకోర్టు (Allahabad High court) శుక్రవారంనాడు నిరాకరించింది. దీంతో జిల్లా కోర్టు ఆదేశాలను సవాలు చేసిన అంజుమన్ ఇంతేజామియా మాసాజిద్కు ఎదురుదెబ్బ తగిలింది.
భర్తకు ఉద్యోగం లేకపోయినా, కూలీగా రోజుకు రూ. 300-400 సంపాదించే అవకాశం ఉన్నందున, తన భార్యకు భరణం అందించాల్సిన బాధ్యత భర్తపై ఉందని అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) తీర్పునిచ్చింది.
అలహాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఓ ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం పీసీ బెనర్జీ హాస్టల్లోని రూమ్ నంబర్ 68లో ఒక బాంబు పేలింది. ప్రభాత్ యాదవ్ అనే విద్యార్థి తన హాస్టల్ రూమ్లో బాంబు తయారు చేస్తున్నప్పుడు...
శ్రీకృష్ణ జన్మభూమి కేసులో (Shri Krishna Janmabhoomi case) అత్యంత కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. మధురలోని షాహీ ఈద్గా కాంప్లెక్స్లో (Shahi Idgah Complexe) సర్వే నిర్వహించేందుకు అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం వారనాసిలోని జ్ఞాన్వాపి మసీదులో కొనసాగుతున్న సర్వేలో కనుగొన్న హిందూ(Hindu) మతానికి సంబంధించిన అన్ని ఆధారాలను జిల్లా మేజిస్ట్రేట్కు(District Majistrate) అప్పగించాలని వారణాసి(Varanasi) కోర్టు బుధవారం ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని ఆదేశించింది.
భారత దేశంలో వివాహ వ్యవస్థను నాశనం చేయడానికి పద్ధతి ప్రకారం కుట్ర జరుగుతోందని అలహాబాద్ హైకోర్టు మండిపడింది. వివాహ వ్యవస్థ యువతీ, యువకులకు భద్రత, సామాజిక ఆమోదం, స్థిరత్వాలను ఇస్తుందని, వీటిని సహజీవనం ఇవ్వదని చెప్పింది.
ఉత్తర ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సైంటిఫిక్ సర్వేను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (Archaeological Survey of India-ASI) శుక్రవారం ఉదయం ప్రారంభించింది. 17వ శతాబ్దంనాటి ఈ మసీదును అంతకన్నా ముందే నిర్మించిన హిందూ దేవాలయంపైన నిర్మించారా? అనే అంశాన్ని నిర్థరించేందుకు ఈ సర్వే జరుగుతోంది.
జ్ఞానవాపి మసీదులో సర్వేకు అలహాబాద్ హైకోర్టు గురువారం అనుమతి ఇచ్చింది. వాస్తవాలు బయటపడాలంటే సర్వే అవసరమని తెలిపింది. అంజుమన్ ఇంతెజామ్ దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. సర్వేకు అనుకూలంగా జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీంతో హిందూ పక్షం ‘‘హర హర మహాదేవ్’’ అంటూ నినాదాలు చేస్తూ, సంతోషం వ్యక్తం చేసింది.
ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్క మాయమవడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గౌరాంగ్ కాంత్కు ఆవేదన కట్టలు తెంచుకుంది. అంకితభావంతో పని చేయని తన ఇంటి భద్రతా సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వెళ్లగక్కారు. ఉదాసీనంగా వ్యవహరించిన భద్రతా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు లేఖ రాశారు.
న్యాయమూర్తులకు కల్పించిన ప్రోటోకాల్ సదుపాయాన్ని ఇతరులకు అసౌకర్యం కలిగే రీతిలో ఉపయోగించుకోవద్దని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ న్యాయమూర్తులను కోరారు. న్యాయ వ్యవస్థ ద్వారా లభించిన అధికారాన్ని ధర్మాసనంపైన, ధర్మాసనం బయట వివేకవంతంగా వినియోగించాలని తెలిపారు.