Home » AIMIM
ఓవైసీ బ్రదర్స్కు(Owaisi Brothers) ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓల్డ్ సిటీ ఓవైసీ కనుసన్నల్లో ఉగ్రవాదుల అడ్డాగా మారిందని ఆరోపించారు.
‘‘హైడ్రా కూల్చివేతల విషయంలో ఒవైసీకి ఒక న్యాయం? ఇతరులకు మరో న్యాయమా? సకలం చెరువును ఆక్రమించిన ఒవైసీ విద్యా సంస్థలకు ఎందుకు నోటీసులివ్వరు?
వక్ఫ్ చట్టంలో పలు సవరణలకు కేంద్రం సిద్ధమైంది. కనిపించిన ప్రతి భూమీ, ఆస్తీ తమదేనంటూ నియంత్రణలోకి తీసుకుంటున్న వక్ఫ్ బోర్డుల అపరిమిత అధికారాన్ని కట్టడి చేయనుంది. మరింత పారదర్శకత కోసం సదరు భూములు/ఆస్తుల విషయంలో కూలంకష తనిఖీలను తప్పనిసరి చేయనుంది.
జీహెచ్ఎంసీ కౌన్సిల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒకరినొకరు కార్పొరేటర్లు కొట్టుకున్నారు.. దీంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది..
బల్దియా(GHMC) అధికారులతో బహదూర్పురా(Bahadurpura) ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్(MLA Mohammed Mubeen) దురుసుగా ప్రవర్తించారు. పెండింగ్ పనుల విషయంలో జీహెచ్ఎంసీ సిబ్బందికి బూతు పురాణం వినిపించారు.
హైదరాబాద్ మినహా మిగతా లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆ పార్టీ శ్రేణులకు సష్టమైన సంకేతమిచ్చారు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు కూడా ధ్రువీకరించారు. ప్రచారం గడువు ముగియడానికి ముందు.. శనివారం మధ్యాహ్నం ఖిల్వత్ మైదానం సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఒవైసీ ప్రసంగించారు.
ఒవైసీ సోదరులను ఉద్దేశించి అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ‘‘15 సెకన్లు కాదు. నేను మోదీకి చెబుతున్నా.. నవనీత్ కౌర్కు గంట సమయం ఇవ్వండి.
తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రెచ్చగొట్టే సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చిన బీజేపీ నాయకురాలు నవనీత్కౌర్ ఒవైసీ సోదరులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
లోక్సభ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పది స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు మంగళవారం పార్టీ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. బిహార్లో ఐదు, మహారాష్ట్రలో నాలుగు, తెలంగాణలోని హైదరాబాద్తో కలిపి మొత్తం పది లోకసభ స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దింపినట్లు పేర్కొన్నారు.
లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి ఏఐఎంఐఎం(AIMIM) అధినేత అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.