Home » AIMIM
నగరంలో బీజేపీ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. పాతబస్తీలో పార్టీని పటిష్టం చేయాలనే ధ్యేయంతో అడుగులు వేస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానంలో మజ్లి్సకు గట్టి పోటీ ఇచ్చేందుకు విరించి ఆస్పత్రి, లతామా ఫౌండేషన్ల చైర్పర్సన్ మాధవీలతకు టికెట్ ఖరారు చేసింది. మజ్లి్సకు దీటుగా ఉండేందుకే మాధవీలతకు టికెట్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజకీయాలకు మాధవీలత కొత్త. ఆమెకు పార్టీలో గాడ్ఫాదర్ ఎవరూ లేరనే చెప్పొచ్చు. ఎంఐఎం కంచుకోటను బద్దలు కొడతానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఏఐఎంఐఎం(AIMIM) బీజేపీ నుంచి డబ్బులు తీసుకుని వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా అభ్యర్థుల్ని నిలబెడుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) ఖండించారు. రాహుల్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హైదరాబాద్ లో నిర్వహించిన బహిరంగ ర్యాలీలో ఈ కామెంట్లు చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎంఐఎం అధినేత అసుదుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి కాకుండా హైదరాబాద్లో పోటీ చేయాలని బహిరంగంగా సవాల్ చేశారు.
ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ (Asaduddin Owaisi) ఇంటిపై అగంతకులు రాళ్ల దాడికి (Stones Pelted ) తెగబడ్డారు. ఢిల్లీలోని (New Delhi) ఆయన నివాసంపై సోమవారం సాయంత్రం 3:30 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది..
రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో ఏర్పాటైన 26 పార్టీల కూటమిపై ఏఐఎంఐఎం (AIMIM) ఆగ్రహం వ్యక్తం చేసింది. భావ సారూప్యతగల ఈ పార్టీలకు తాము రాజకీయంగా అంటరానివారమయ్యామా? అని నిలదీసింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ను వ్యతిరేకిస్తు్న్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించారు. యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) పేరుతో దేశ ప్రజలను విభజించేందుకు కుయుక్తులు పన్నుతున్నదని, విభిన్న ప్రాంతాలు, జాతులు, మతాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతులు కలిగి.. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన భారత ప్రజల ఐక్యతను చీల్చేందుకు కేంద్ర ప్రభుత్వ తీసుకునే నిర్ణయాలను తాము నిర్ద్వందంగా తిరస్కరిస్తామని కేసీఆర్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) గెలుపుపై ఎవరి ధీమా వారిదే.. హ్యాట్రిక్ కొట్టబోతున్నామని బీఆర్ఎస్ (BRS) చెబుతుంటే.. మూడోసారి ఎలాగెలుస్తారో చూద్దామని కాంగ్రెస్ (Congress), బీజేపీలో (BJP) ఉన్నాయి.. కర్ణాటక (Karnataka) తర్వాత తాము గెలవబోయేది తెలంగాణలోనే అని కాంగ్రెస్ చెప్పుకుంటోంది..
ఎంఐఎం, కాంగ్రెస్, జేడీఎస్లు ముస్లింల ఓట్లను చీల్చే అవకాశం ఉంది.
హైదరాబాద్ (Hyderabad) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి మజ్లిస్ అభ్యర్థిగా మీర్జా రహ్మత్ బేగ్ (Mirza Rahmat Baig)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
తెలంగాణలో అధికారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న బీజేపీ.. ఇప్పుడు ఓల్డ్సిటీనే ఎందుకు టార్గెట్ చేసుకుంది? కార్నర్ మీటింగ్లతో మజ్లిస్ పార్టీతో ‘తాడో-పేడో’ తేల్చుకుంటామన్నట్లు ఎందుకు వ్యవహరిస్తోంది?.. ఈ ప్రశ్నలన్నింటికి బీజేపీ ఎత్తుగడలే సమా