Home » AIADMK
మరో ఏడాదిలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ కూటమి ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే, మిత్రపక్షాలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు.
మాజీ మంత్రి డి.జయకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను పార్టీ నుంచి వైదొలగే ప్రసక్తే లేదంటూ ఆయన అన్నారు. అంతేగాక తాను పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సోషల్ మీడియాలో పనిగట్టుకుని ప్రత్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అడుగుకూడా పెట్టలేదని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుందగై అన్నారు. ఈ వ్యా్ఖ్యలు ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారాయి. ఓపక్క గత రెండు రోజుల క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడం, మరోవైపు అధికార డీఎంకే, దాని మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ పలు విమర్శలు చేస్తుండడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది.
మహిళలను కించపరచడం డీఎంకే పార్టీ నేతలకు అలవాటేనని అన్నాడీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి సెల్లూరు రాజు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పొన్ముడి మాత్రమే కాదు, డీఎంకే నేతల్లో పలువురు మహిళలకు వ్యతిరేకంగా, బడుగు బలహీన వర్గాల మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించడం అలవాటేనన్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ మధ్య పొత్తు కుదరడంపై డీఎంకే ప్రతినిధి టీకేఎస్ ఇళాంగోవన్ సూటిగా స్పందించారు.
అన్నాడీఎంకేకు ఎలాంటా షరతులు, డిమాండ్లు లేవని అమిత్షా చెప్పారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చోసుకోమని, పొత్తుల వల్ల అటు ఎన్డీయేకు, అన్నాడీఎంకే కూడా లబ్ధి చేకూరనుందని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు ఎడప్పాడి పళనిస్వామి, ఒ.పన్నీర్ సెల్వం భేటీ కానున్నారు. రామనాథపురం జిల్లాలో పాంబన్ వంతెన ప్రారంభోత్సవానికి ఆదివారం ప్రధాని మోదీ విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ ఇద్దరు మాజీ సీఎంలు ప్రధానితో భేటీ కానున్నారు.
అన్నాడీఎంకే నేతలపై రాష్ట్ర ఉమ ముఖ్యమంత్రి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కమలనాథుల దర్శనం కోసం కార్లు మార్చి మార్చి వెళ్ళారంటూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చానీయాంశమైంది.
ఆ మాజీ ముఖ్యమంత్రిని తిరిగి పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి స్పష్టం చేశారు. దీనిపై ఎవరికీ ఎటువంటి అనుమానాలు అవసరంలేదని ఆయన మరోమారు పేర్కొన్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్షాను పళనిస్వామి, ఆ పార్టీ సీనియర్ నేతలు న్యూఢిల్లీలో మంగళవారంనాడు కలుసుకున్నారు. దీంతో పొత్తు ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే తమ సమావేశం వివరాలపై ఆయన క్లుప్తంగా మాట్లాడుతూ, ప్రజలకు సంబంధించిన అంశాలపైనే తాము మాట్లాడామని చెప్పారు.