• Home » Adilabad

Adilabad

ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఎదుట రేషన్‌ డీలర్ల నిరసన

ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఎదుట రేషన్‌ డీలర్ల నిరసన

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం నస్పూర్‌లోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఎదుట రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పలువురు డీలర్లు నిరసన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించాలని గోదాం ఇన్‌చార్జి శంకర్‌కు వినతిపత్రం అందించారు.

స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి

స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి

దేవాపూర్‌లోని ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీలో స్ధానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రభావిత గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని కంపెనీ పర్మినెంటు వర్కర్స్‌ లోకల్‌ యూనియన్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ అన్నారు.

నర్సింగాపూర్‌ను కార్పొరేషన్‌లో విలీనం చేయవద్దు

నర్సింగాపూర్‌ను కార్పొరేషన్‌లో విలీనం చేయవద్దు

మండలంలోని నర్సింగాపూర్‌ గ్రామాన్ని మంచిర్యాల కార్పొరేషన్‌లో విలీనం చేయవద్దని బీజేపీ నాయకులు అన్నారు. మంగళవారం కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌కు బీజేపీ నాయకులు వినతిపత్రం అందించారు.

ప్రారంభమైన   జాతీయస్థాయి సాఫ్ట్‌ బేస్‌బాల్‌ పోటీలు

ప్రారంభమైన జాతీయస్థాయి సాఫ్ట్‌ బేస్‌బాల్‌ పోటీలు

బెల్లంపల్లి పట్టణంలో జాతీయ స్థాయి సాఫ్ట్‌ బేస్‌బాల్‌ పోటీలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని తిలక్‌ క్రీడా మైదానంలో 9వ సాఫ్ట్‌ బేస్‌బాల్‌ సబ్‌ జూనియర్‌ యూత్‌ అండ్‌ గర్ల్స్‌ నేషనల్‌ చాంపియన్‌ పోటీలను ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ ప్రారంభించారు.

ప్రాణహిత-చేవెళ్లపై చిగురిస్తున్న ఆశలు

ప్రాణహిత-చేవెళ్లపై చిగురిస్తున్న ఆశలు

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కంటే తుమ్మిడిహెట్టి బ్యారేజీ ద్వారానే తక్కువ ఖర్చుతో గోదావరి జలాలను ఎత్తిపోయవచ్చని ముందు నుంచి కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంటుంది. అందుకు అనుగుణంగా ఆ ప్రాజెక్టును నిర్మించేందుకు అడుగులు వేస్తోంది. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై బ్యారేజీ నిర్మించేందుకు సన్నాహాలను ప్రారంభించింది.

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ప్రజావాణిలో అం దిన దరఖాస్తులను అధికారులు సమన్వయంతో త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆర్డీవోలు శ్రీని వాసరావు, హరికృష్ణలతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. వేలాల శివారు ఇసుక క్వారీలో అవకతవకలు నెలకొన్నాయని జాడి యేసయ్య దరఖాస్తు అందజేశారు.

నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలి

నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలి

చెన్నూరు మండలం బాబూరావు పేట శివారులో గుడిసెలు వేసుకున్న పేదలకు ఇంటి పట్టాలను ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయ ఏవోకు అందించారు.

  ప్రజలు అంబులెన్స్‌ సేవలు వినియోగించుకోవాలి

ప్రజలు అంబులెన్స్‌ సేవలు వినియోగించుకోవాలి

అత్యవసర సమయంలో ప్రజలు అంబులెన్స్‌ సేవలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి అన్నారు. సోమవారం రైతువేదిక ప్రాంగణంలో కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి 108 అంబులెన్స్‌ను ప్రారం భించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు అంబు లెన్స్‌ను ప్రారంభించామన్నారు.

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్క రించాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని డి మాండ్‌ చేస్తూ సోమవారం కలెక్టరేట్‌ ఎదు ట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అభినవ్‌, బండి సత్య నారాయణ, ద్యాగం శ్రీకాంత్‌లు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రీయిం బర్స్‌మెంట్స్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం

నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం

సింగరేణి దేశ పారిశ్రామిక రంగానికి ఇంధన వనరు.. తెలంగాణ రాష్ట్రానికి సిరుల మాగాణి... సింగరేణి... వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మరెన్నో కుటుంబాలకు ఉపాధి కల్పించే కల్పవల్లి. బొగ్గు ఉత్పత్తితోపాటు విద్యుత్‌ ఉత్పత్తి చేసి రాష్ట్ర రైతాంగానికి, పారిశ్రామిక రంగానికి దన్నుగా నిలుస్తోంది... సోమవారం సింగరేణి ఆవిర్భావ వేడుకలను జరుపుకునేందుకు కార్మికలోకం సిద్ధమైంది...

తాజా వార్తలు

మరిన్ని చదవండి