Home » Adilabad District
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని తొడసం వంశస్థుల ఆరాధ్య దైవమైన ఖాందేవుని జాతర ప్రతీఏడాది జనవరిలో సంక్రాంతి రోజున మొదలవుతుంది.
అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో పోలీసులపై దాడి ఘటన కలకలం రేపింది. గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఓ యువకుడు బాలికతో కలిసి ఉండగా స్థానికులు గదిలో బంధించారు.
బారెడు పొద్దెక్కినా ఇంకాసేపు ముసుగుతన్ని పడుకుంటే బాగుణ్ణు అనిపిస్తోంది! కప్పుకున్న దుప్పటి తీయబుద్ధేయడం లేదు.. మంచం దిగాలనిపించడం లేదు.. అంతా చలిపులి భయంతోనే! ఉదయం గడియారం తొమ్మిది గంటలు కొట్టినా..
కొమురం భీం జిల్లా: పులి జాడ కోసం కాగజ్ నగర్ అడవుల్లో అన్వేషణ కొనసాగుతోంది. ఇటిక్యాల్ పహాడ్ అటవీ ప్రాంతంలోనే పులి ఉందని అటవీ అధికారులు నిర్దారించారు. ట్రాప్ కెమెరాలు, డ్రోన్ ల ద్వారా సెర్చింగ్ చేస్తున్నారు. 10 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. పులి ప్రభావిత గ్రామాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి.
కొమురం భీం జిల్లాలో పెద్దపులి టెన్షన్ కొనసాగుతోంది. రెండు రోజుల్లో పెద్దపులి ఇద్దరిపై దాడి చేసింది. పులి జాడ కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఇటిక్యాల్ పహాడ్ అటవీ ప్రాంతంలోనే పులి ఉందని అటవీ అధికారులు నిర్దారించారు. రైతులు, కార్మికులను పంట చేలకు, అటవీ మార్గాల్లోకి అధికారులు వెళ్ళ నీయడంలేదు.
పెద్దపులి కదలికల నేపథ్యంలో కొమురం భీం జిల్లా, కాగజ్నగర్, సర్పూర్ టీ మండలాల్లోని 15 గ్రామాల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. అభరాణ్యంలో ఉండాల్సిన పులులు జనారణ్యంలో తిరుగుతున్నాయి. గ్రామల పొలిమేరలోకి వచ్చి వరుస దాడులు చేస్తూ.. మూగజీవాలు, మనుషులను హతమారుస్తున్నాయి. పులిదాడిలో వ్యవసాయ కూలీ మరణించగా రైతు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానిక ప్రజలకు కంటిమీద కునుకు కరువవుతోంది.
కొమురం భీం: జిల్లాలో టైగర్ టెర్రర్.. పులి దాడిలో ఓ మహిళ మృతి చెందింది. దీంతో అటవీ గ్రామాల్లో భయాందోళన నెలకొంది. నాలుగేళ్లలో పులుల దాడిలో నలుగురు మృతి చెందారు. తాజాగా పులి దాడిలో మహిళ మృతి చెందింది. ఈ ఘటనతో స్థానిక ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు.
కలుషిత ఆహారం తినడంతో తీవ్ర అస్వస్థతకు గురైన గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని చౌదరి శైలజ (14) సోమవారం సాయంత్రం మృతి చెందింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతు న్న 20 మంది విద్యార్థులు.. అక్టోబరు 30న పాఠశాలలో వాంతులు విరేచనాలతో అ స్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.
వానా కాలం సీజన్కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ప్రారంభమైనప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. వరికోతలు ప్రారంభించక ముందే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించా లని భావించినా ఆచరణలో అమలు కావడంలేదు. ఫలితంగా కోతలు పూర్తయి పంట చేతికి వచ్చిన రైతులు ప్రైవేటు మార్కెట్ను ఆశ్రయించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రం, రాపల్లి గ్రామంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల ఇతర అన్ని అంశాలపై ప్రభుత్వం చేపట్టిన సర్వేను జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలన్నారు.