Home » Adani Group
కొద్ది రోజులుగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటూ భారీ నష్టాలను చవిచూసిన అదానీ షేర్లు తిరిగి పుంజుకున్నాయి. అదానీకి చెందిన చాలా సంస్థల షేర్లు అప్పర్ సర్క్యూట్కు చేరుకున్నాయి. బుధవారం ఒక్కరోజే అదానీ గ్రూప్ కంపెనీల విలువ 90 వేల కోట్లకు పైగా పెరిగింది. అదానీ షేర్లు రాణింపుతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాలు అందుకున్నాయి
దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న జగన్, అదానీ వ్యవహారంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆఘ మేఘాలపై విద్యుత్పై కుదిరిన అనుబంధం.. ఒప్పందాల గుట్టు రట్టయింది. మంత్రి వర్గం ఆమోదం లేకుండానే రెండు అనుబంధ విద్యుత్ విక్రయ ఒప్పందాలు జరిగిన విషయం బయటకు వచ్చింది.
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన సమీప బంధువు సాగర్ అదానీ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వీనిత్ జైన్లపై యూఎస్లో లంచం ఆరోపణలపై కేసు నమోదు చేశారనే వార్తల్లో వాస్తవం లేదని గ్రీన్ ఎనర్జీ స్పష్టం చేసింది. వారు సెక్యూరిటీస్కు సంబంధించి మోసం కేసులు ఎదుర్కొంటున్నారని వివరించింది.
‘‘తెలంగాణకు చెందిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని వెనక్కు ఇవ్వాలని నిర్ణయించావ్.. మరి దావోస్లో ఆయనతో చేసుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందం మాటేంటి రేవంత్రెడ్డీ?’’ అంటూ మాజీమంత్రి హరీశ్రావు ప్రశ్నించారు.
అదానీతో జగన్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలన్నీ రద్దుచేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు.
‘‘ఒక సదుద్దేశంతో ప్రారంభించిన స్కిల్స్ యూనివర్సిటీ వివాదాస్పదం కావడం మాకు ఇష్టం లేదు. అందుకే అదానీ సంస్థ నుంచి రూ.100 కోట్లు స్వీకరించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రివర్స్ టెండరింగ్ పేరిట కాంట్రాక్టర్లను మార్చేయడం... మద్యం విధానం... ఇసుక పాలసీ... స్మార్ట్ మీటర్ల టెండర్లు... బైజూస్ ట్యాబ్లు... తాజాగా ‘సెకీ’తో ఒప్పందం పేరిట అదానీ నుంచి సోలార్ విద్యుత్ కొనుగోలు! అన్నీ వివాదాస్పదమే... అన్నింటా ‘ఆర్థిక’ ఆరోపణలే!
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్కు ఆర్టీసీ స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ (APPTD) ప్రతినిధులు లేఖ రాశారు. రామగిరిలో గతంలో ఉన్న విండ్ ఎనర్సి ప్రాజెక్టుకు సంబంధించిన సుమారు 300 ఎకరాల స్థలాన్ని అతి తక్కువ లీజుతో SECI (సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) పేరుతో అదానికి లీజుకు ఇచ్చారని చెప్పారు.
అదానీకి తెలంగాణలోని డిస్కంలను అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న కుట్రల మాటేమిటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అవినీతి పరుడు అన్న వ్యక్తికే గల్లీ కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరిచిందని ఎద్దేవా చేశారు.
దిగ్గజ వ్యాపారవేత్తగా అదానీ మన దేశం పరువు ప్రపంచం ముంగిట తీస్తే, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంధ్ర రాష్ట్ర ప్రజల పరువును తీశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో గౌతమ్ అదానీ నుంచి రూ.1750 కోట్ల ముడుపులు అందుకున్న జగన్పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీబీఐతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.