Home » Actress
యువ నటి దివ్యాంక సిరోహి కన్నుమూశారు. మంగళవారం రాత్రి ఉత్తర ప్రదేశ్లోని ఇంట్లో ఆమె గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించేలోపు మార్గం మధ్యలోనే తుదిశ్వాస విడిచారు.
తమిళనాడు రాజధాని చెన్నైలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. ప్రముఖ నటి త్రిష కృష్ణన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు పంపిన ఈమెయిల్ పోలీసులను అప్రమత్తం చేసింది.
ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్యనే తమిళ బుల్లి తెర నటి సుభాషిణి బాలసుబ్రహ్మణ్యం ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన మరవక ముందే.. ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సీనియర్ నటి ‘సూపర్ మ్యాన్’ఫేం వాలెరీ పెర్రీస్ కన్నుమూసిన విషయం మరవక ముందే మరో యువ నటి రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది.
నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడైన సిద్ధార్థ్రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. ట్రయల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించగా, తెలంగాణ హైకోర్టు దాన్ని రెండేళ్లకు తగ్గించింది. ఈ తీర్పును సవాల్ చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో, నాలుగు వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థ్రెడ్డిని ఆదేశించింది.
ప్రముఖ హాలీవుడ్ నటుడు టామీ లీ జోన్స్ కూతురు విక్టోరియా జోన్స్ చనిపోయింది. 34 ఏళ్ల వయసులో హోటల్ గదిలో శవమై తేలింది. విక్టోరియా మరణానికి గల కారణాలు ఏంటో తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రముఖ సినీనటి మాధవీలతకు బిగ్ షాక్ తగిలింది. ఆమెపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో సాయిబాబా దేవుడు కాదని తప్పుడు ప్రచారాలు, వ్యాప్తి చేసినందుకు మాధవీలతపై కేసు నమోదు చేశారు.
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మూక దాడులను, హత్యలను సినీ ప్రముఖులు ఖండిస్తున్నారు. గాజాలో జరిగిన పరిణామాలను అయ్యో పాపం అనుకున్నా భారతీయులు, పొరుగు దేశం బంగ్లదేశ్లో జరుగుతున్న పరిణామాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు.
సెంబర్ 21వ తేదీన అమెరికా, ఎడిసన్లోని ఇంట్లో ఇమానీ దియా స్మిత్ హత్యకు గురయ్యారు. ఇమానీని హత్య చేశాడంటూ పోలీసులు ఇమానీ ప్రియుడు జోర్డాన్ డీ జాక్సన్ను అదుపులోకి తీసుకున్నారు.
కన్నడ నటి రన్యా రావు 127.3 కిలోల బంగారం అక్రమంగా రవాణా చేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో డిఆర్ఐ రూ.102.55 కోట్లు జరిమానా చెల్లించాలని ఆమెకు నోటీసు జారీ చేసింది.