Home » ACB
భూ సర్వే, నాలా కన్వర్షన్ కోసం లంచాలు తీసుకుంటూ సర్వేయర్, డిప్యూటీ తహసీల్దార్లు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో శనివారం ఈ ఘటనలు జరిగాయి.
గనుల శాఖలో దొంగలు పడ్డారు. నాడు జగన్ ప్రభుత్వంలో మైనింగ్ కంపెనీల నుంచి బలవంతంగా వాటాలు తీసుకొని సెటిల్ చేసిన కీలక ఫైళ్లు ఇప్పుడు కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం రాకముందే వాటిని మాయం చేసేశారు.
Telangana: ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఈడీకి ఏసీబీ అందజేసింది. ఏసీబీ ఇచ్చిన వివరాలను ఈడీ క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఈడీ విచారణను మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది.
Formula E race case: ఫార్ములా ఈ రేస్ కేసులో ఫిర్యాదుదారుడు దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ అధికారులు విచారణను ప్రారంభించనున్నారు. దాన కిషోర్ నుంచి పలు కీలకమైన డాక్యుమెంట్లను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి దానకిషోర్ వివరణ ఇచ్చారు.
పత్రికల సర్క్యులేషన్ ఆయన పట్టించుకోలేదు... టీవీ చానళ్ల ప్రేక్షకాదరణ చూడలేదు.. నాటి అధికార పార్టీ పత్రిక, టీవీని మాత్రమే చదివారు.. చూశారు..
దళితులు, గిరిజనుల పేరుతో ప్రభుత్వ సొమ్ము స్వాహా చేసిన వ్యవహారంలో సీఐడీ మాజీ అధిపతి సంజయ్పై ఏసీబీ కేసు నమోదు చేసింది.
Former CID DG Sanjay: సీఐడీ మాజీ డీజీ సంజయ్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. నిధుల దుర్వినియోగం కేసులో ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పలు సెక్షన్ల కింద ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది.
వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దాడులు కలకలం సృష్టించాయి.
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో ఏ1గా ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించినా.. ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ఎంట్రీతో బీఆర్ఎస్ వర్గం ఆందోళనలో ఉంది. మరోవైపు ఈ రేసు కేసుపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మౌనంగా ఉన్నారు. ఆయన మౌనం గులాబీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
సీనియర్ ఐపీఎస్ అధికారి, సీఐడీ మాజీ చీఫ్ ఎన్.సంజయ్ ప్రాసిక్యూషన్కు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.