Home » AAP
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దీంతో ఆయన వారసులు ఎవరే ఓ చర్చ అయితే వాడి వేడిగా సాగుంది. అలాంటి వేళ ఢిల్లీ మంత్రి అతిషి పేరు కేజ్రీవాల్ వారసురాలిగా తెరపైకి వస్తుంది.
సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తాననడం ఢిల్లీ ప్రజల విజయంగా బీజేపీ అభివర్ణించింది. సుప్రీం ఆంక్షలు ఉన్నందునే ఆయన తన పదవిని వదులుకోవడానికి సిద్ధమైనట్లు ఆరోపించింది.
ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కేజ్రీవాల్ తీహాడ్ జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యారు. అనంతరం జైలు దగ్గర తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన ఆప్ కార్యకర్తలను ఉద్దేశించి ఓ వాహనం పై నుంచి మాట్లాడుతూ... జైలు గోడలు తన మనోధైర్యాన్ని దెబ్బతీయలేవని, జైలుకు పంపాక తన మనోధైర్యం 100 రెట్లు పెరిగిందని చెప్పారు.
లిక్కర్ స్కాం కేసులో కొంతకాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) శుక్రవారం సాయంత్రం తిహార్ జైలు(Tihar Jail) నుంచి విడుదలయ్యారు.
కేజ్రీవాల్ నాయకత్వంలోని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం చిక్కుల్లో పడింది. ఆప్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ బీజేపీ నేతలు ఇచ్చిన మెమొరాండంను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. కేంద్ర హోం శాఖకు సిఫారసు చేశారు.
ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని కుప్పకూలిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్కు మొత్తం 70 సీట్లు కట్టబెట్టడం ద్వారా ప్రజలే బీజేపీకి గట్టి గుణపాఠం చెబుతారని, బీజేపీకి జీరో స్కోర్కే పరిమితమవుతుందని అతిషి తెలిపారు.
ఆమ్ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ పొత్తుపెట్టుకుందని ప్రచారం జరిగింది. రెండు పార్టీలు కలిసిపోటీ చేయాలని నిర్ణయించాయి. దీంతో ఇండియా కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందనే అంచనాలు మరింత పెరిగాయి. కానీ నామినేషన్ల స్వీకరణ గడువు దగ్గరపడుతున్న కొద్ది హర్యానా రాజకీయాలు..
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె్సతో పొత్తు చర్చలు విఫలం కావడంతో ఒంటరిగా బరిలోకి దిగాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది.
వచ్చే నెలలో హరియాణా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టత ఇచ్చింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పొట్టుకోవడం లేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలో నిలుపుతామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది.