Home » AAP
తమ పార్టీ అధికారంలోకి వస్తే స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు బస్సు ఛార్జీలు సైతం లేకుండా అవస్థలు పడుతున్న విద్యార్థులకు బాసటగా నిలుస్తామని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
అతిషిపై బిధూడి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. అతిషి ఇంటిపేరు మార్చుకున్నారంటూ జనవరి 6న రోహిణిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది.
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అభ్యర్థిగా కల్కాజీ నియోజకవర్గం నుంచి అతిషి పోటీలో ఉన్నారు. ఎన్నికల ప్రచారానికి రూ.40 లక్షలు అవుతుందని అతిషి అంచనా వేశారు.
మద్యం విధానంపై కాగ్ నివేదికను అసెంబ్లీకి సమర్పించేలా ప్రత్యేక సమావేశానికి ఆదేశించాలంటూ బీజేపీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు విచారణ జరిపింది.
కేజ్రీవాల్ మాయలో ఢిల్లీ ప్రజలు చిక్కుకోవద్దని బిధూరి సూచించారు. ఢిల్లీ ప్రజల కోసం అంకితమైన బీజేపీకి మెజారిటీ ఇవ్వాలని కోరారు. బీజేపీ అంటే తనకు ఎంత అంకితభావం ఉందో ప్రజల పట్ల కూడా అంతే అంకితభావం ఉందని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాలో కొత్తగా భారీ సంఖ్యలో ఓటర్లు నమోదు కావడంపై కేజ్రీవాల్ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. గత డిసెంబర్ 15, జనవరి 8వ తేదీ మధ్య 15 రోజుల కాలంలో 13,000 కొత్త ఓటర్లు వచ్చి చేశారని చెప్పారు.
గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో ఆప్ పొత్తుపెట్టుకున్నప్పటికీ ఆ తర్వాత జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేసింది. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు ఆప్ మొదట్లోనే ప్రకటించింది.
ఢిల్లీలో 'ఆప్' తమకు విపక్షమని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి బుధవారంనాడు జరిగిన ఒక కార్యకర్మంలో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించడంపై ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చురకలు వేశారు.
మూడు నెలల క్రితం కూడా ఇలాగే చేశారని, తన వస్తువులన్నింటినీ రోడ్డుపైకి విసిరేశారని అతిషి ఆక్షేపణ తెలిపారు. బీజేపీ ఒకటి గుర్తుంచుకోవాలని, ఇవాళ మరోసారి సీఎం నివాసం నుంచి గెంటేసినా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకొంటామని చెప్పారు.
కేజ్రీవాల్ను మరోసారి అదికారంలోకి తీసుకురావాలంటూ ఎన్నికల ప్రచార గీతాన్ని తాజాగా ఆ పార్టీ విడుదల చేసింది. ''ఫిర్ లాయేంగే కేజ్రీవాల్" అనే టైటిల్, 3.38 నిమిషాల నిడివితో ఈ సాంగ్ ఉంది.