Home » 2024
మండల పరిధిలోని కల్లుమడి-గుమ్మేపల్లి రోడ్డుపై కల్లుమడి సమీపంలో పైపు పగిలిపోవడం తో పెద్ద రంధ్రం పడింది. ఎంపీఆర్ దక్షిణ కాలువకు అను బంధంగా ఉన్న ఐదు కాలువ నుంచి పొలాలకు నీరు వెళ్లేందుకు ఈ సిమెంట్ పైప్ లైన ఏర్పాటు చేశారు. రోడ్డుకు అడ్డంగా వెళుతున్న ఈ పైపు దాదాపు ఏడాది క్రితం పగిలిపోయి రోడ్డులో పెద్ద రంధ్రం ఏర్పడింది.
క్రికెట్ క్రీడాకారుల ఎంపిక పోటీల్లో గందరగోళం నెలకొంది. అండర్-12 బాలుర జిల్లా క్రికెట్ జట్టు ప్రాబబుల్స్ ఎంపిక పోటీలు ఆదివారం స్థానిక అనంత క్రీడాగ్రామంలో నిర్వ హించారు. అయితే 12ఏళ్ల వయస్సు పైబడిన, హైదరా బాద్, బెంగళూరులలో నివాసముంటూ, అక్కడే ప్రాక్టీస్ చేస్తున్న క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎలా ఎంపిక చేస్తా రంటూ కొందరు క్రీడాకారుల తల్లిదండ్రులు నిరసనకు దిగారు.
వ్యవసాయంలో సాంకేతి కత చాలా అవసరమని ఎ మ్మెల్యే పరిటాల సునీత పే ర్కొన్నారు. నగరంలోని ఆమె క్యాంప్ కార్యాలయం వద్ద ఆదివారం రాప్తాడు నియోజకవర్గంలోని పలువురు రైతులకు సబ్సిడీపై మంజూరైన పంట కోత యంత్రాలను పంపిణీ చేశారు.
రోడ్డు పనుల నాణ్యతలో రాజీ పడొద్దని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ సూచిం చారు. స్థానిక శ్రీనగర్ కాలనీ లో జరుగుతున్న తారు రోడ్డు పనులను ఆదివారం టీడీపీ నాయకు లతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు.
గత ఐదేళ్ల పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో సంపద సృష్టి ఏమో గాని ప్రజా ధనం చెత్తలో కలిసిపోతోంది. గత టీడీపీ పాలనలో లక్షలాది రూపాయలు ఖర్చు చేపి చెత్తతో సంపద తయారీ కేంద్రాలను ప్రతి పంచాయ తీలోనూ నిర్మించారు. చేత్త సేకరణకు ప్రతి కేంద్రానికి ఇద్దరి నుంచి ఐదుగురి వరకు కార్మికుల (క్లాప్ మిత్ర లు)ను నియమించారు.
ఎప్పుడూ విజయాలు అపజయాలను మాత్రమే లెక్క వేసుకునే టాలీవుడ్ చిత్రపరిశ్రమను ఈ ఏడాది పలు వివాదాలు చుట్టుముట్టాయి.
అన్నమయ్య జిల్లాలో డ్యూటీలలో ఉన్న గాలివీడు ఎంపీడీ ఓ జవహర్బాబుపై వైసీపీ నేత దాడి చేయడం దుర్మార్గ మని ఎంపీడీఓలు, మిని స్టీరియల్ ఉద్యోగులు, నాలుగో తరగతి ఉద్యోగులు, ఇతర పంచాయతీరాజ్ సిబ్బంది ఖం డించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని ఎంపీడీఓ కార్యాలయాల వద్ద శనివారం ఎంపీడీఓలు, ఇతర సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
అధికారంలో ఉండగా రైతుల గురించి ఏ మార తం పట్టించుకోకుండా, విద్యుతరంగాన్ని సర్వ నాశనం చేసిన వైసీపీ అఽధినేత వైఎస్ జగన ఇప్పుడు మొసలి కన్నీరుకారుస్తున్నారని ఎమ్మె ల్యే పరిటాలసునీత విమర్శించారు. మండలం లోని వెంకటాపురంలో శనివారం ఆమె విలేక రుల సమావేశంలో మాట్లాడారు.
వైసీపీ ఆడుతున్న దొంగ నాటకాలను ఇప్పటికైనా ఆపాలని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొ న్నారు. టీడీపీ అర్బన కార్యాలయంలో శనివారం పలువురు టీడీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.
ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికులకు వాహన పార్కింగ్ కష్టాలు తొలిగేనా.! అనే అనుమా నాలు వాహనదారుల్లో వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేం ద్రంలోని ఆర్టీసీ బస్టాండు మీదుగా రోజుకు దాదాపు 85వేల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు.