Home » 2024
ప్రజా ప్రయాణ ప్రాంగణాలపై సంక్రాంతి పండుగ ఎఫెక్ట్ కనిపించింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఇప్పటికే విద్యార్థులంతా దాదాపు సొంతూళ్లకు చేరుకున్నారు. ఇక ప్రభుత్వ కార్యాలయాలకు సోమవారం నుంచి సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో శనివారం ఎటుచూసినా రోడ్లన్నీ వాహనాలమయమైంది.
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పాల న సాగిస్తోందని ఎమ్మె ల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. గార్లదిన్నెలోని రైతు సేవా కేందల్రో చీనీ ప్రోసెసింగ్ యూనిట్ ఏర్పాటుపై గురువారం ఉద్యానవన రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, ఏపీ ఫుడ్ సోసైటీ అధికారి శేఖర్బాబు ముఖ్య అతిథులుగా హాజరై రైతులతో చర్చించారు.
తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మరణిం చడం చాలా బాధాకరమని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక శ్రీనగర్ కాలనీలోని అయ్యప్పస్వామి ఆలయం సమీపంలో గురువారం డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ నిర్వహణ ఆవరణంలో బాలకృష్ణ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు గౌస్మొద్దీన, ఎనబీకే హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులు జగనతో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు.
రాప్తాడు నియోజక వర్గంలో రోడ్ల సమస్య లు లేకుండా చేస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ఆమె గురువారం టీడీపీ ధర్మవరం నియోజకవర్గం ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ తో కలిసి మండలంలోని ముత్యాలంపల్లి నుంచి వెంకటాపురం వరకు జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు,.
నగరంలోని నాలుగురోడ్ల రహదారి దాదాపు పూర్తయింది. కానీ కీలకమైన కూడలి విషయంలో ముక్తాయింపు పలకడంలో సందిగ్థం నెలకొంది. దాదాపు నాలుగేళ్ల క్రితం నగరంలోని పంగల్రోడ్డు నుంచి బళ్లారి బైపాస్ వరకు 9. 2 కిలోమీటర్ల మేర ఫోర్లేన రహదారి నిర్మాణానికి టెండరు పిలిచారు.
అంగనవాడీల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలుగునాడు అంగనవాడీ ట్రేడ్ యూనియన (టీఎనఏటీయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గడ్డం అనంతలక్ష్మి, కె.లక్ష్మీనరసమ్మ పేర్కొన్నారు. స్థానిక ఐసీడీఎస్ కార్యా లయంలో బుధవారం యూనియన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వ హించారు.
మండల కేంద్రంలోని ఓ విద్యుత స్తంభానికి బల్బు అమరుస్తుండగా... ఉన్నట్టుండి ఆ స్తంభం ఓ పక్కకు ఒరిగిపోయిం. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరుగలేదు. శింగనమల చిన్నకాలువ వీధిలో బుధవారం సాయం త్రం విద్యుత స్తం భాలకు బల్బులు అమరుస్తున్నారు.
కూటమి ప్రభుత్వం తోనే విద్యా రంగం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంక టేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. దయనీయ పరిస్థితుల్లో ఉన్న హాస్టళ్లకు కూటమి ప్రభుత్వం మరమ్మతులు చేసిన విషయం విదితమే. అందులో భాగంగానే నగరంలోని మరమ్మతులు చేపట్టిన గిల్డాఫ్ సర్వీస్ స్కూల్ పక్కనున్న ఎస్సీ నెం2 ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ బాలికల వసతిగృహాలను బుధవారం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ ముఖ్య అతిథులు గా హాజరై ప్రారం భించారు.
పేదవాడి సొంతింటి కలను ని జం చేస్తామంటూ గత వైసీపీ ప్రభుత్వం ఏకంగా కాలనీలనే ఏర్పాటు కు పూనుకుంది. అయితే మండలంలో ఏ ఒక్కరికీ ఇల్లు మంజూరు చే య లేదు. అంతేకాకుండా ఒక్కొక్కరికి ఒకటిన్నర సెంటు స్థలం మాత్రం మంజూరు చేయడం, అనువుగానిచోట స్థలాలు ఇవ్వడంతో చాలా మంది ఇళ్ల నిర్మాణానికి అసక్తి చూపలేదు.
జిల్లా పట్టుపరిశ్రమ శాఖ కా ర్యాలయంలోని చెట్లను మంగళవారం కొట్టివేశా రు. అయితే కార్యాలయ పర్యేవేక్షకులు, జిల్లా అధికారికి తెలియకుండా కొట్టివేయడంపై అను మానాలు తలెత్తుతున్నాయి. దాదాపు పదెకరాల విస్థీర్ణమున్న పట్టుపరిశ్రమ శాఖ కార్యాలయం లో రీలింగ్ యూనిట్, సంచార రైతు శిక్షణ,, సాంకేతిక సేవ, పట్టుపరుగుల ఉత్పత్తి కేంద్రా లు ఉన్నాయి.