Home » National
హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడుల బాధితురాలిని అపహరించారనే కేసులో ఆయన తండ్రి, జనతాదళ్ సెక్యులర్ నేత, హోలెనర్సిపుర ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణకు ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిలును ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ సోమవారంనాడు మంజూరు చేశారు.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సోమవారం సాయంత్రం భారీ ఈదురుగాలులు పెను బీభత్సం సృష్టించాయి. తేలికపాటి వర్షంతో పాటు బలమైన గాలులు వీచడంతో ఘట్కోపార్ ప్రాంతంలో భారీ హోర్డింగ్ పేకమూడలా కుప్పకూలి నలుగురు దుర్మరణం పాలయ్యారు. సుమారు 57 మంది గాయపడ్డారు.
లోక్సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ సందర్భంగా పశ్చిమబెంగాల్ లో భారీగా పోలింగ్ నమోదైనప్పటికీ పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. బర్దమాన్-దుర్గాపూర్ లోక్సభ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తృణమూల్ కాగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకోగా, కల్నా గేట్లో బీజేపీ అభ్యర్థి దిలీప్ ఘోష్ కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది.
పాకిస్థాన్ చేతిలోని ఆటంబాంబు అంటే ఇండియా కూటమి నేతలు భీతిల్లిపోతున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో బహిరంగ చర్చ జరిపేందుకు తమ పార్టీ తరఫున యువ నాయకుడు అభినవ్ ప్రకాశ్ను పంపిస్తామని బీజేపీ ప్రకటించింది.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎ్సఎంఈ)కు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు వ్యతిరేకమని..
ఎన్నికల ప్రచారంలో విద్వేష ప్రసంగాలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని స్వీకరించడానికి సోమవారం ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ కొట్టివేతకు ముంబై హైకోర్టు నిరాకరించింది. 2010 జూలైలో బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ప్రాజెక్టు వద్దకు ఆయన ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్లారు.
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ దక్షిణాదిన భారీ విజయం సాధిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు.
మైనర్ బాలిక ఇష్టంతో శృంగారంలో పాల్గొన్నా అది అత్యాచారం కిందకే వస్తుందని, అలాంటి లైంగిక సంబంధాన్ని తాము అంగీకరించేబోమని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది.