చెన్నై నగరంలోని విల్లివాక్కం, విరుగంబాక్కం, కొళత్తూరు నియోజకవర్గాల్లో టీవీకే అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ సోమవారం ఉదయం నుండి రాత్రి వరకు విస్తృత ప్రచారం చేశారు.
గత కొన్ని రోజులుగా ముమ్మరంగా సాగిన ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగియనుంది. ఈ నెల 23న పోలింగ్ జరుగనుంది.
గత ఐదేళ్లుగా రాష్ట్రాభివృద్ధికి నిధులివ్వకుండా, రాష్ట్ర హక్కులను హరించివేస్తున్న బీజేపీ పాలకులకు కట్టుబానిసలుగా వ్యవహరిస్తున్న అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామిని, ఏఎంఎంకే నేత దినకరన్ను ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు.
ప్రతి ఇంటి గుమ్మం ముందు ‘విజిల్’ గుర్తుతో రంగవల్లికలు వేయాలంటూ టీవీకే అధ్యక్షుడు విజయ్ పిలుపు మేరకు అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది.
‘సినిమాల్లో నటించి హీరోగా రాణించవచ్చు, ఓ సినిమాలో ముఖ్యమంత్రిగాను నటించవచ్చు, అయితే రాజకీయాల్లా అది సులభం కాదు.. అని ప్రముఖ నటుడు ప్రకాష్రాజ్ టీవీకే నేత విజయ్పై పరోక్షంగా విమర్శలతో విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వివిధ పార్టీల నాయకులు, అభ్యర్థుల వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నాయకులు ప్రయాణించే హెలికాప్టర్లలోనూ సోదాలు జరుపుతున్నారు.
రాజకీయాల్లో టీవీకే అధ్యక్షుడు విజయ్ లాలీపాప్ తింటున్న పిల్లోడేనని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విమర్శించారు.
టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న తరుణంలో, ఆయన ప్రచార సరళిపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రచారానికి వెళ్తున్న ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి కారును ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేశారు.
లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ముసాయిదా చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎన్ని రకాల ఆందోళనలు జరపటానికైనా తాను సిద్ధమేనని, తమిళుల రక్తం వేడి తగ్గిపోయిందని, వీధుల్లో ఆందోళనలకు దిగరని భావిస్తే కేంద్రంలోని బీజేపీకి చుక్కెదురవటం ఖాయమని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ హెచ్చరించారు.