స్థానిక పుళల్ కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న హరి నాడార్, ఆలంకుళం నియోజకవర్గంలో పోటీచేసేందుకు నామినేషన్ వేశారు.
కన్నియాకుమారి జిల్లా పద్మనాభపురం నియోజకవర్గం పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రంలో 9 మంది ఓటర్లుండగా, ఎన్నికల అధికారులు సుమారు 150 కి.మీ పయనించాల్సిన పరిస్థితులన్నాయి.
ప్రముఖ నేపథ్యగాయని, బిహార్ బీజేపీ ఎమ్మెల్యే మైథిలి ఠాగూర్ రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అబద్ధాలు చెప్పడంలో సమర్థులని, ఈ ఎన్నికల్లో వారిచ్చే హామీలను నమ్మొద్దని రాష్ట్ర ప్రజలను టీవీకే అధ్యక్షుడు విజయ్ హెచ్చరించారు.
టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచారాన్ని అడ్డుకోవాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని మంత్రి ఐ.పెరియస్వామి స్పష్టం చేశారు.
టీవీకే నేత విజయ్కు రాష్ట్ర ప్రజల గురించి తమిళ సంస్కృతి, రాజకీయాల గురించి ఎలాంటి అవగాహన లేకుండా కలల ప్రపంచంలో విహరిస్తున్నారని కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ విమర్శించారు.
ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్రంలో పెత్తనంచెలాయిస్తున్న బీజేపీ మంత్రులకు అన్నాడీఎంకే నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి కట్టుబానిసలా వ్యవహరిస్తున్నారని ఉపముఖ్యమంత్రి ఉదయనిధి ఎద్దేవా చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం నాయకుడు విజయ్ పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాలను ఎంచుకోవడం వెనుక బలమైన కారణాలు వినిపిస్తున్నాయి.
అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టోను కాపీ కొట్టారంటూ కొంతమంది చేస్తున్న విమర్శలను డీఎంకే నాయకురాలు కనిమొళి కొట్టిపారేశా రు. వారి మేనిఫెస్టోను కాపీ కొట్టాల్సిన అవసరం తమకు లేదని వ్యాఖ్యానించారు.
డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్కు ఇవే చివరి ఎన్నికలని, ఆయన్ని ఇంటికి సాగనంపాలని ప్రజలు నిర్ణయించారని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షుడు విజయ్ పేర్కొన్నారు.