Home » Elections
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నెలకొన్న పరిస్థితులు, లోక్ సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ల గురించి ప్రస్తావించారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీ పరిస్థితి గురించి వెంకట్ రెడ్డి ప్రస్తావించారు.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మెజార్టీ ఎంపీ సీట్లు గెలుస్తోందని ప్రధాని మోదీ అభిప్రాయ పడ్డారు. కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బండి సంజయ్ గెలవడం పక్కా అని స్పష్టం చేశారు. వేములవాడలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. మూడు విడతలు ఇప్పటికే ముగిశాయి. పోలింగ్ ముగిసిన మూడోవిడతలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం మహారాష్ట్రలోని బారామతి.. ఇక్కడ ఫ్యామిలీ వార్ నడుస్తుండగా.. విజయంపై ఉత్కంఠ నెలకొంది. ఎన్సీపీ, ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీల మధ్య ఈ నియోజకవర్గంలో ప్రధాన పోటీ నెలకొంది.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు వేములవాడలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అంతకుముందు వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. దర్శనానికి ముందు కోడె మొక్కును సమర్పించారు. గతంలో ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తి ఎవరూ కూడా కోడె మొక్కు అందించలేదు.
ఏపీ అసెంబ్లీ 2024 (AP Election 2024), లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో జగన్ సారధ్యంలోని వైఎస్సార్సీపీ మరోసారి ఫేక్ ప్రచారం మొదలుపెట్టింది. ఈ సారి పథకాలు రాకపోవడానికి చంద్రబాబే కారణమంటూ వైసీపీ గ్యాంగ్ ఫేక్ విష ప్రచారం షురూ చేసింది. ఆసరా, చేయూత, ఫీజ్ రీయింబర్స్మెంట్లపై ఏపీ వాసులకు ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తోంది.
ఈనెల13న జరిగే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని డకౌట్ చేయాలని సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. తెలంగాణ వర్సెస్ గుజరాత్ మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ వల్ల దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఆరోపించారు.కామారెడ్డిలో కార్నర్ మీటింగ్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ (BJP) స్పీడప్ చేసింది. తెలంగాణపై బీజేపీ అగ్రనేతలు వరుసగా దండయాత్ర మొదలెట్టనున్నారు. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో అమితమైన ప్రజాదరణ కలిగిన ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) ‘బిగ్ డిబేట్’ (Big Debate) చర్చా కార్యక్రమం మరో విశిష్ఠ రాజకీయ అతిథితో వీక్షకుల ముందుకొచ్చింది. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ, ప్రముఖ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ (RK) హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి నేడు (మంగళవారం) తెలంగాణ సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విశిష్ఠ అతిథిగా విచ్చేశారు.
లోక్సభ ఎన్నికలు-2024లో భాగమైన మూడో దశ ఎన్నికల పోలింగ్ మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. గడువు సమయానికి క్యూలైన్లలో ఉన్నవారందరికీ అధికారులు ఓటింగ్కు అవకాశం కల్పించారు. కాగా సాయంత్రం 5 గంటల సమయానికి మూడో దశ పోలింగ్ 60.19 శాతంగా నమోదయిందని ఎన్నికల సంఘం వెల్లడించింది.