భావాలను బట్వాడా చేయడంలో వార్తాపత్రికల కాలమిస్ట్లకు సాధారణంగా స్వేచ్ఛ ఉంటుంది. చెప్పదలచిన విషయాన్ని సులభంగా, సుబోధకంగా చెప్పేందుకు వారు తమ సొంత మాటలను ఎంపిక చేసుకుంటారు.
నేనుఒక దారి తప్పిన సంచారిని. ఇరవై రెండు సంవత్సరాల క్రితం భారత్లో నా ఆత్మ స్వగృహాన్ని మళ్లీ కనుగొన్నాను.
మౌలిక భావుకత, శక్తిమంతమైన శైలి నిండుగా ఉన్న కథానికలు, ఇంకా ‘కుసుమబాలె’ అనే ఒక నవలిక ద్వారా కన్నడ సాహితీ జగత్తులో దేవనూర మహాదేవ తొలుత ప్రసిద్ధుడయ్యారు.
నాజీవనయానంలో పలువురు ప్రముఖులను కలుసుకున్నాను. విద్వజ్ఞులు, సాహితీవేత్తలు, కళాభిజ్ఞులు, క్రీడాకారులు, వైజ్ఞానికులు, వ్యవస్థా నిర్మాణ దక్షులు, రాజకీయ నాయకులు, ప్రజాహిత క్రియాశీలురుగా..