బతుకమ్మ అంటే బతుకు కోరేది. ఆ పండగ రోజు ప్రారంభమైంది. మొత్తం తొమ్మిది రోజుల పాటు ఈ పండగ తెలంగాణలోనే కాకుండా దేశ విదేశాల్లో జరుపుకుంటారు.
‘తీర్థాల సన్నిధి యందు స్నానం సేయగనే పుణ్యములు పొంగునయా’ అని తిరుమల కొండల్లోని పుణ్య తీర్థాల గురించి తాళ్లపాక అన్నమా చార్యులు ఓ కీర్తనలో చెబుతారు. శేషాచలం అంతా తీర్థాల మయం. ఈ కొండల్లో 66కోట్ల పుణ్యతీర్థాలు ఉన్నాయని బ్రహ్మపురాణం, స్కంధ పురాణం వెల్లడిస్తాయి.
తెలంగాణలో అతి పెద్ద పండుగ బతుకమ్మ. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ పండగ.. ఈ రోజు ప్రారంభమైంది. బతుకమ్మ పండగలో భాగంగా ముఖ్యంగా గౌరీ దేవిని అత్యంత భక్తి శ్రద్దలతో భక్తులు ఆరాధిస్తారు.
ఎన్ని కష్టాలు పడి అయినా ఏడు కొండలు ఎక్కి వెంకన్న స్వామిని దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటారు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి తిరుపతి దాకా చేరుకోవడం ఒక ఎత్తయితే... తిరుపతి నుంచి తిరుమల కొండమీదకు చేరుకోవడం ఒక ఎత్తు.
హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి అంటే ఒక ముహూర్తం ఉండాలి. తాళి, తలంబ్రాలు ఉండాలి. మంగళమేళాలు హంగూ ఆర్భాటాలు తప్పనిసరి. తిరుమల శ్రీవేంకటేశ్వరుడి సన్నిధిలో మాత్రం వీటిలో దేనికీ ప్రాధాన్యం లేదు. ఇవేవీ లేకుండానే పెళ్లి జరిగిపోతుంది.
‘‘ఏడు కొండల సామి.. ఎక్కడున్నావయ్యా... ఎన్నీ మెట్లెక్కినా.. కానరావేమయ్యా.. ఈ అడవిదారిలో.. చేయూతనీయవా..’’ అంటూ శ్రీవేంకటేశ్వర మహత్యము సినిమాలోని పాట, తిరుమలకు చేరుకోవడం ఎంత కష్టమో వివరిస్తుంది. ఇప్పుడంటే ఎక్కడానికీ దిగడానికీ వేరువేరుగా సురక్షితమైన తారురోడ్లు ఉన్నాయి కానీ... ఒకప్పుడు దట్టమైన అడవిలో, క్రూరమృగాల నడుమ నుంచి, వాగులు వంకలు దాటి బండలు కొండలు ఎక్కి, లోయలు దాటి తిరుమలకు చేరుకోవాల్సి వచ్చేది.
తిరుమల శ్రీనివాసుడిని దర్శించు కోవడమే ఒక దివ్యానుభూతి. ఎక్కడెక్కడి నుంచో కష్టాలకోర్చి తిరుమలకు చేరుకుంటారు. గంటలకు గంటలు క్యూల్లో వేచివుండి అయినా స్వామి దర్శనం చేసుకుంటారు. వసతుల్లేవని విసుక్కోరు. క్షణకాలం ఆయన మూల మూర్తిని దర్శించుకోగానే పడ్డ శ్రమంతా మరచి పోతారు.
సంపన్నులతో వేలూ లక్షలూ ఖర్చుపెట్టించే తిరుమల వెంకన్న, పేదలకు మాత్రం పైసా ఖర్చు లేకుండా తన దర్శనం చేసుకునే అవకాశం కల్పించాడు. తిరుపతికి చేరుకున్న భక్తులు చేతిలో పైసా లేకపోయినా సలక్షణంగా తిరుమలకు చేరుకుని స్వామి దర్శనం చేసుకోవచ్చు.
తిరుమల వెంకన్నకి రోజూ షడ్రసోపేతమైన ఆహారపదార్థాలే నైవేద్యంగా పెడతారు. ఇవన్నీ పోషకవిలువలు మెండుగా ఉన్నవే. ఆయుర్వేదపరంగా అత్యంత ఆరోగ్యకరమైనవే. దాదాపు 50 రకాలైన నైవేద్యాలను స్వామికి సమర్పిస్తారు.
అమ్మలగమ్మయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ.. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గమ్మ వారి దసరా ఉత్సవాలు ప్రారంభానికి రంగం సిద్ధమైంది. అందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది.