Somireddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జగన్ హయాంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూముల్లో ఎంత దోపిడీ చేశావో అందరికీ తెలుసునని చెప్పారు. ఎన్నికల కోడ్కు ఒక్క రోజు ముందు కాకాణి గోవర్ధన్ రెడ్డి 57.5 ఎకరాలు కొట్టేశారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.
ప్రయోగ్రాజ్ కుంభమేళాలో జరుగుతున్న తీరును మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రపంచ చరిత్రగా అభివర్ణించారు. 45 కోట్ల మంది కుంభమేళలో పవిత్ర స్నానం చేయడం ఒక్క భారతదేశంలోనే జరుగుతుందన్నారు. మారుతున్న తరానికి అనుగుణంగా యువతలో మార్పురావాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.
Money Scam Case: కాల్మనీ రాక్షసులు మళ్లీ రెచ్చిపోతున్నారు. వారు చేస్తున్న అరాచకాలతో ప్రజలు భయాభ్రాంతులకు గురవుతున్నారు. తీసుకున్న అప్పుకు లక్షలకు లక్షలు వడ్డీలు కట్టినా వేధిస్తోండటంతో బాధితులు న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
Call Money Case: ఏపీలో కాల్మనీ మళ్లీ పడగ విప్పుతోంది. కాల్మనీ రాక్షసుల ధన దాహానికి చాలా మంది ప్రజలు బలవుతున్నారు. వేలల్లో తీసుకున్న అప్పుకు లక్షలు చెల్లించినా వడ్డీ వ్యాపారుల వేధింపులు ఆగడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో మరోసారి కాల్మనీ దందా తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.
నెల్లూరులోని ఓ శిశుమందిర్లో ఏడో తరగతి చిన్నారిపై వ్యాన్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. రోజూ చిన్నారిని బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దాడికి ఒడికట్టాడు కామాంధుడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరించేవాడు.
నెల్లూరు: ఏపీలో 27 వేల కి.మీ. రోడ్లలో వాహనాలు తిరిగే పరిస్థితి లేదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అవన్నీ పునర్ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తి చేసినట్లు చెప్పారు.
Kakani Govardhan Reddy land scam: మాజీ మంత్రి కాకణి గోవర్థన్ రెడ్డి భారీ స్థాయిలో భూ ఆక్రమణలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై కూటమి ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని బాధితులు కోరుతున్నారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహిస్తున్న అక్షరం అండగా పరిష్కారమే అజెండాగా కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. ఆంధ్రజ్యోతిలో సౌత్ మోపూరు గ్రామ సమస్యలపై కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. సౌత్ మోపూరులో సమస్యలు, అభివృద్దికి రూ.1.12 కోట్ల నిధులు కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్: నలుగురు ఉండే కుటుంబానికి లక్షల చదరపు అడుగుల ప్యాలెస్లు ఎందుకంటూ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి మండిపడ్డారు. తల్లిని, చెల్లిని దూరం చేసుకున్న ఆయన కూటమి నేతల సంగతి చూస్తానంటే నవ్వొస్తోందని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.
పూర్వం రాజ్యాలను పాలించిన రాజులు పావురాలను పెంచేవారు. అలా పెంచిన పావురాలతో ఒక రాజ్యం నుంచి మరో రాజ్యానికి లేఖలతో రాయబారం పంపేవారు. ఇందుకోసం వాటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు. ఇప్పుడు కాలం మారింది.. టెక్నాలజీ కూడా పెరిగింది. దీంతో కొంతమంది పావురాలతో పందేలు కాస్తున్నారు.