YSRCP Flexi: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలు పనుల నిమిత్తం ఆటోలో బయలుదేరి వెళుతుండగా ఆత్మకూరు మండలంలోని ఏఎస్ పేట క్రాస్ రోడ్డు వద్ద ఆటోను కారు బలంగా ఢీ కొంది. ఈ ఘటనలో 4 గురు మృతి చెందగా.. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.
Somireddy Slams Jagan: కాంగ్రెస్ను అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించి.. అదే కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచారంటూ జగన్పై ఎమ్మెల్యే సోమిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలను వెన్నుపోటు పొడిచారని.. వెన్నుపోటు దినోత్సవం జరుపుకునే అర్హత జగన్కు లేదన్నారు.
Kakani Court Case: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కస్టడీ పిటిషన్పై కోర్టులో వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
నెల్లూరు జిల్లాలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు డ్రైవర్లు మృతిచెందారు. ఈ సంఘటన విడలూరు మండలం ముదివర్తి గ్రామంలో జరిగింది. ఈ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
YCP: 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో ఘన విజయాన్ని అందుకున్న వైసీపీ.. 2024 ఎన్నికల్లో ఊహించని విధంగా ఘోర పరాజయంపాలైంది. కేలవం 11 స్థానాలకే పరిమితం అయిపోయింది. ఈ క్రమంలో అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు వేరే పార్టీలోకి జంప్ అవుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో...
కడప వేదికగా మహానాడు సూపర్ సక్సెస్ను వైసీపీ, ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఏపీ విద్యా శాఖ మంత్రిగా లోకేశ్ చేపట్టిన సంస్కరణలు చూసి ఓర్వలేని స్థితికి ఆ పార్టీ దిగజారిందని మండిపడ్డారు.
Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి వెంకటగిరి కోర్టు రిమాండ్ విధించింది. క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో కాకాణిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.
Kakani Arrest:బెంగళూరులో అరెస్టు చేసిన మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డిని పోలీసులు నెల్లూరు తీసుకువచ్చారు. సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం రుస్తుం మైన్స్లో అక్రమంగా కార్ట్జ్ ఖనిజం కొల్లగొట్టిన కేసులో పోలీసులకు దొరక్కుండా రెండు నెలలుగా పరారీలో ఉన్న ఆయన్ను ఆదివారం బెంగళూరు శివార్లలో అదుపులోకి తీసుకున్నారు.
Kavali CI Overaction: జగన్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి... కొంత మందితో కలిసి వెళ్లి కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం పైలాన్ను విధ్వంసం చేశారు. ఈ కేసులో రామిరెడ్డి ఏ8 నిందితుడిగా ఉన్నారు.