DSR కంపెనీ ట్యాక్స్ చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు సమాచారం రావడంతో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఐటీ అధికారలు తెలిపారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, SR నగర్, సురారంలో సోదాలు కొనసాగుతున్నాయి.
మైకా అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. కాకాణికి న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉన్నారు.
వర్సీస్ ట్రైనింగ్, మైగ్రేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఫాస్ట్ ట్రాక్ అనుమతులకు నిధులు ఇవ్వాలని మంత్రి లోకేశ్ కోరారు. ఈ మేరకు సింగపూర్ పర్యటనలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చర్చల వివరాలు ఆయన వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 35 లక్షల ప్రవాసాంధ్రులు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నారని తెలిపారు.
సీపీ రాధాకృష్ణన్కు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఆయన్ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
జగన్కు కుట్ర రాజకీయాలు తప్ప దేశభక్తి, రాష్ట్రం పట్ల అభిమానం లేవని లోకేశ్ విమర్శించారు. ఐదేళ్లు సీఎం పదవిని అనుభవించి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న జగన్ కనీసం స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొనకపోవడం ఆయన అవివేకమని ఆరోపించారు.
నిందితుడి ప్రకాష్ను అదుపులోకి తీసుకుని తన వద్ద నుంచి 22 కిలోల గంజాయి, కారు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రకాష్పై ఈస్ట్ గోదావరి, ఏలూరు, నెల్లూరులో పలు గంజాయి కేసులు నమోదు అయినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో ఓ పోలీసు ఉన్నతాధికారితో సన్నిహిత సంబంధాలు పెంచుకుని ఓ మహిళ.. ఆ ఐదేళ్లలో అత్యంత పవర్ఫుల్గా తయారయ్యారనే వార్తలు స్థానికుల్లో వినిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు, పోలీసుల అండతో.. తన కనుసైగలతో సెటిల్మెంట్లు, దందాలను నడిపించేదని తెలుస్తోంది.
రజనీకాంత్ సినిమాలు లెక్కలేనన్ని జీవితాలను తాకాయని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. నడక, సంభాషణలు పలకడం, హావభావ విన్యాసాల్లో రజనీ ప్రత్యేకతను చూపిస్తారని తెలిపారు.
మహిళలకు అవకాశాలు కల్పిస్తే ఏదైనా చేస్తారని, అద్భుతాలు సృష్టిస్తారని పీతల సుజాత ధీమా వ్యక్తం చేశారు. మహిళల కోసం స్త్రీ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లకు రాష్ట్ర మహిళల తరఫున ఆమె ధన్యవాదాలు తెలిపారు.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి బలపరచిన తెలుగుదేశం అభ్యర్థులు సాధించిన విజయం కచ్చితంగా ఆయా మండలాల ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.