మాచర్ల.. పల్నాడు జిల్లాలోని ఒక నియోజకవర్గం. ఇది నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 నాటికి నియోజకవర్గంలో మొత్తం 2,50,330 మంది ఓటర్లు ఉన్నారు. 1955లో ఈ నియోజకవర్గం స్థాపించబడింది. ఈ నియోజకవర్గంలో మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, రెంటచింతల, కారెంపూడి మండలాలు ఉన్నాయి. 1955లో సీపీఐ నుంచి మందపాటి నాగిరెడ్డి, 1962లో కాంగ్రెస్ నుంచి ముడవతు కేశవనాయకుడు, 1967లో కాంగ్రెస్ నుంచి వెన్న లింగారెడ్డి, 1972లో స్వతంత్ర అభ్యర్థి జూలకంటి నాగిరెడ్డి, 1978లో కాంగ్రెస్ నుంచి చల్లా నారపరెడ్డి, 1983లో టీడీపీ నుంచి కొర్రపాటి సుబ్బారావు, 1985లో కాంగ్రెస్ నుంచి కృష్ణమూర్తి, 1989లో టీడీపీ నుంచి నిమ్మగడ్డ శివరామ కృష్ణ ప్రసాద్, 1994లో టీడీపీ నుంచి వున్నా రెడ్డి, 1999లో టీడీపీ నుంచి జూలకంటి దుర్గాంబ, 2004లో కాంగ్రెస్ పిన్నెల్లి లక్ష్మారెడ్డి, 2009లో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కాంగ్రెస్ నుంచి, 2012, 2014, 2019లలో వైసీపీ నుంచి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, టీడీపీ నుంచి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పోటీ పడనున్నారు.
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
