చిలకలూరిపేట.. పల్నాడు జిల్లాలోని ఒక నియోజకవర్గం. ఇది నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విడదల రజిని ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి గెలుపొందారు. 25 మార్చి 2019 నాటికి నియోజకవర్గంలో మొత్తం 2,23,809 మంది ఓటర్లు ఉన్నారు. 1951లో ఈ నియోజకవర్గం మనుగడలోకి వచ్చింది. ఇందులో నాదెండ్ల, చిలకలూరిపేట, ఎడ్లపుడు అనే మండలాలున్నాయి. 1952లో సీపీఐ నుంచి కర్ణం రంగారావు, స్వతంత్ర పార్టీ నుంచి 1967లో కందిమళ్ల బుచ్చయ్య, 1972లో కాంగ్రెస్ నుంచి బొబ్బల సత్యనారాయణ, 1978లో కాంగ్రెస్ నుంచి సోమేపల్లి సాంబయ్య, 1983లో టీడీపీ నుంచి కాజా కృష్ణ మూర్తి, 1985లో కాంగ్రెస్ నుంచి సోమేపల్లి సాంబయ్య, 1989లో టీడీపీ నుంచి కందిమళ్ల జయమ్మ, 1994లో కాంగ్రెస్ నుంచి సాంబయ్య, 1999లో టీడీపీ నుంచి ప్రత్తిపాటి పుల్లారావు, 2004లో స్వతంత్ర అభ్యర్థిగా మర్రి రాజశేఖర్ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 2009, 2014లలో టీడీపీ నుంచి ప్రతిపాటి పుల్లారావు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో వైసీపీ నుంచి విడదల రజనీ గెలుపొందారు. 2024లో టీడీపీ నుంచి ప్రత్తిపాటి పుల్లారావు మరోసారి బరిలో ఉండగా, వైసీపీ నుంచి కావటి శివ నాగ మనోహర్ నాయుడు బరిలో నిలిచారు.
96
2024
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
