Share News

ప్లాస్టిక్‌ భూతం.. చైతన్యమే లక్ష్యం

ABN , Publish Date - Jul 04 , 2026 | 12:03 AM

ప్లాస్టిక్‌ అనర్థాలపై ప్రజల్లో చైతన్యం నింపేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్‌ వినూత్నంగా ప్రయత్నించారు.

ప్లాస్టిక్‌ భూతం.. చైతన్యమే లక్ష్యం
ఒంటిపై ప్లాస్టిక్‌ కవర్లను కప్పుకుని అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్‌

సూర్యాపేటటౌన, జూలై 3 (ఆంధ్రజ్యోతి) : ప్లాస్టిక్‌ అనర్థాలపై ప్రజల్లో చైతన్యం నింపేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్‌ వినూత్నంగా ప్రయత్నించారు. శుక్రవారం అంతర్జాతీయ ప్రపంచ ప్లాస్టిక్‌ సంచుల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలో పూర్తిగా ప్లాస్టిక్‌ కవర్లతో తయారు చేసిన ఓ గౌనును ధరించి ప్రదర్శన ఇచ్చారు. ప్లాస్టిక్‌ బూతాన్ని అవగాహనతో నిర్మూలించవచ్చన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నయంగా క్లాత సంచులను ఉపయోగించాలన్నారు. పశువులు సైతం ప్లాస్టిక్‌ కవర్లను తిని అనారోగ్యానికి గురవుతున్నాయని వివరించారు. ఆయన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.

Updated Date - Jul 04 , 2026 | 12:03 AM